ఇక ఆర్టీసీలోనూ ఆఫర్లు

సాక్షి, అమరావతి: ప్రయివేటు ట్రావెల్స్‌ పోటీని తట్టుకునేందుకు ఆర్టీసీ కూడా ఆఫర్లు ప్రకటిస్తోంది. దీనిలో భాగంగా తాజాగా ‘ఎర్లీ బర్డ్‌’ ఆఫర్‌ను తీసుకొచ్చింది. మార్చి 31 వరకు ఇది అమల్లో ఉంటుంది. దీని ప్రకారం అన్ని ఏసీ బస్సు చార్జీల్లో 10 శాతం రాయితీ వర్తిస్తుండగా,





 నాన్‌ ఏసీ సర్వీసుల్లో(సూపర్‌ డీలక్స్, అల్ట్రా) పది శాతం సీట్లకు మాత్రమే వర్తిస్తుంది. అయితే 48 గంటల ముందు అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ చేయించుకున్న వారికే ఈ రాయితీలు వర్తిస్తాయి. నాన్‌ ఏసీ దూరప్రాంత సర్వీసులైన సూపర్‌ లగ్జరీలో 35 సీట్లకు గాను నలుగురికి, అల్ట్రా డీలక్స్‌లో 39 సీట్లకు గాను నలుగురికి, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో 49 సీట్లకు గాను ఐదుగురికి మాత్రమే రాయితీకి అవకాశం ఉంటుంది.

పూర్తి స్థాయిలో రోడ్డెక్కనున్న ఏసీ సర్వీసులు 
సంస్థలో మొత్తం ఏసీ సర్వీసులు 348 వరకూ ఉండగా, ప్రస్తుతం 270 సర్వీసులనే ఆర్టీసీ నడుపుతోంది. వీటిలో డాల్ఫిన్‌ క్రూయిజ్, అమరావతి, గరుడ, గరుడ ప్లస్, ఇంద్ర సర్వీసులున్నాయి. మిగిలిన సర్వీసులనూ ఆర్టీసీ పునరుద్ధరించనుంది. కరోనా కారణంగా ఏసీ సర్వీసులకు ఆదరణ తగ్గింది. మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనడంతో వాటికి ఆదరణ పెంచేందుకే ఆర్టీసీ ఈ ఆఫర్‌ ప్రకటించింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఇక ఆర్టీసీలోనూ ఆఫర్లు"

Post a Comment