దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభం
ఢిల్లీ: దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ మొదలైంది. వర్చువల్ ద్వారా వ్యాక్సిన్ ప్రక్రియను ప్రధాని మోదీ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 3 వేల కేంద్రాలలో వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సిన్ కార్యక్రమమన్నారు.ఇంతటి మహాయజ్ఞం దేశంలో ఎన్నడూ జరగలేదన్నారు
. ప్రపంచమంతా వ్యాక్సిన్ కోసం ఎదురుచూసిందని, చాలా తక్కువ సమయంలో కరోనా వ్యాక్సిన్ వచ్చిందన్నారు. శాస్త్రవేత్తల కృషిఫలితంగా రెండు దేశీయ టీకాలు వచ్చాయన్నారు. శాస్త్రవేత్తలు రేయింబవళ్లు కష్టపడి వ్యాక్సిన్లు తయారు చేశారని ప్రశంసించారు. శాస్త్రవేత్తలు పండుగలు జరుపుకోలేదని, వ్యాక్సిన్ తయారు చేసిన శాస్త్రవేత్తలకు అభినందనలన్నారు. ఎన్నో సవాళ్ల మధ్య కరోనా వ్యాక్సిన్ వచ్చిందని, మరికొన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయన్నారు.
మొదటగా వ్యాక్సిన్ పొందడానికి ఆరోగ్య సిబ్బంది అర్హులని మోదీ అన్నారు. ఆ తర్వాత పారిశుద్ధ్య సిబ్బందికి వ్యాక్సిన్ ఇస్తామన్నారు. ఆ తర్వాత సైనికులు, మిగిలినవారికి వ్యాక్సిన్ ఇస్తామన్నారు. తొలిదశలో 3 కోట్ల మందికి ఉచితంగా టీకా ఇస్తున్నామని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ కోసం కోవిన్ పోర్టల్ రూపొందించామని, టీకాలపై దుష్ప్రచారం చేయొద్దని కోరారు. మన వ్యాక్సిన్ను ప్రపంచ దేశాలు నమ్ముతున్నాయని, కరోనాను ధైర్యంగా ఎదుర్కొన్నామన్నారు. అంతే ధైర్యంగా వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు. మొదట మాస్క్ల కోసం ఇబ్బంది పడ్డామని, ఇప్పుడు వ్యాక్సిన్ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామన్నారు
0 Response to "దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభం"
Post a Comment