కరోనా కల్లోలం: మార్చి 31 వరకూ స్కూళ్లు బంద్Dec
భోపాల్: దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతున్న నేపధ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం స్కూళ్లు తెరిచే విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న క్లాసులు మొదలుకొని 8వ తరగతి వరకూ స్కూళ్లను మార్చి 31 వరకూ తెరవకూడదని నిర్ణయించింది.
దీనికితోడు ఈ ఏడాది ఐదవ తరగతి, ఎనిమిదవ తరగతి బోర్డు పరీక్షలను నిర్వహించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది.
అలాగే 9వ తరగతి నుంచి 12 వ తరగతి వరకూ చదివే విద్యార్థులకు వారంలో ఒకటి లేదా రెండు రోజుల పాటు తరగతులు నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన జరిగిన విద్యాశాఖాధికారుల సమావేశంలో ఈ విధమైన నిర్ణయాలు తీసుకున్నారు
0 Response to "కరోనా కల్లోలం: మార్చి 31 వరకూ స్కూళ్లు బంద్Dec"
Post a Comment