జాతీయ గణిత దినోత్సవ వేడుకలు -2020

*✨ జాతీయ గణిత దినోత్సవ వేడుకలు -2020* 

★ డైరెక్టర్ SCERT శ్రీ ప్రతాపరెడ్డి గారి ఆదేశాల ప్రకారం పాఠశాల విద్యార్థులలో గణితం పట్ల ఆశక్తి పెంపొందించే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ గణిత దినోత్సవ వేడుకలు -2020 జరగనున్నాయి. 

★ దీనిలో భాగంగా కృష్ణా జిల్లాలోని అన్ని డివిజన్లలలోను Dy.E.O. ల ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి గణిత  దినోత్సవ పోటీలు నిర్వహించబడును.  

★ దీనిలో భాగంగా అన్ని యాజమాన్యాల పాఠశాలల విద్యార్థులకు క్రింది పోటీలు నిర్వహించబడును.
 *నిర్వహించనున్న పోటీలు* :
★ 1.వ్యాసరచన (అంశం: శ్రీనివాస రామానుజన్)
★ 2.సృజనాత్మక గణిత నమూనా తయారీ
 *అర్హతలు :* 
★ అన్ని యాజమాన్య పాఠశాలలో 9 & 10 తరగతులు చదివే విద్యార్థులు.
 *నిర్వహణా విధానం* :
★ మొదటి దశలో పోటీలు డివిజన్ స్థాయిలో Dy.E.O. ల ఆధ్వర్యంలోజరుగును. పోటీలో పాల్గొనే విద్యార్థులు ది.22-12-20 న డివిజన్ కేంద్రంలో  పోటీలలో పాల్గొనవలెను.

★ ప్రతిడివిజన్ నందుఅత్యుత్తమ వ్యాసరచనవిజేత & అత్యుత్తమ గణిత నమూనా ఎంపిక చేయబడతాయి.(Only First places)

★ ది .30-12-20 న* డివిజన్ స్థాయి విజేతలకు నేరుగా రాష్ట్ర స్థాయిలో పై రెండు అంశాలలో పోటీలు SCERT ఇబ్రహీంపట్నం నందు నిర్వహించ బడతాయి.

★ వివరములకు జిల్లా సైన్స్ అధికారి శ్రీ మైనం హుస్సేన్ గారిని 9866528299 సంప్రదించ వలెను.

 *ఎం వి. రాజ్యలక్ష్మి*
*జిల్లా విద్యాశాఖాధికారి*
*కృష్ణా జిల్లా*

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "జాతీయ గణిత దినోత్సవ వేడుకలు -2020"

Post a Comment