14డిశంబర్ నుండి ఉన్నత పాఠశాలల్లో ఎ రోజు ఎ తరగతి విద్యాశాఖ ప్రకటన

కొవిడ్‌ -19 మహమ్మారి కారణంగా 2020-21 విద్యా సంవత్సరానికి తేది: 02.11.2020
నుండి 9వ మరియు 10వ తరగతి విద్యార్థులకు మరియు తేది: 23.11.2020 నుండి 8వ తరగతి
విద్యార్థులకు పాఠశాలలు ప్రారంభమైన సంగతి విదితమే. తేది:13.12.2020 న ప్రభుత్వం తాజా గా
విడుదలచేసిన ఉత్తర్వుల మేరకు అన్ని యాజమాన్య పాఠశాలల్లో 7వ తరగతి విద్యార్థులకు తరగతులు
తేది: 14.12.2020 నుండి పునఃప్రారంభం అగును.

౫ 7వ తరగతి విద్యార్థులు: సోమవారం, బుధవారం, శుక్రవారములలో పాఠశాలకు
హాజరు కావాలి.

౫ 8వ తరగతి విద్యార్థులు : మంగళవారం, గురువారం ,శనివారములలో పాఠశాలకు
హాజరు కావాలి.
౫ 9,10 వ తరగతుల విద్యార్థులు : ప్రతిరోజు పాఠశాలకు హాజరు కావాలి.

౫ పాఠశాలలో తరగతుల నిర్వహణకు తగినన్ని గదులు సదుపాయం ఉండి విద్యార్థుల
సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలల్లో 7,8, 9 మరియు 10 తరగతులను ప్రతిరోజు
నిర్వహించ వచ్చును.




౫ సమయపాలన : ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు
తరగతులు నిర్వహించాలి.

౫ గమనిక:- 6వ తరగతి విద్యార్థులకు తరగతుల పునఃప్రారంభం ప్రభుత్వ
ఆదేశానంతరం తెలియజేసాము.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Related Posts :

0 Response to "14డిశంబర్ నుండి ఉన్నత పాఠశాలల్లో ఎ రోజు ఎ తరగతి విద్యాశాఖ ప్రకటన"

Post a Comment