ఆడ పిల్లల పేర్లు రెడ్ ఇంక్తో రాయొద్దన్నాం
సాక్షి, విజయవాడ: పిల్లల్లో
సమైక్యతా భావాన్ని పెంచేందుకే స్కూల్ రిజిస్టర్లో మార్పులు తెచ్చామని
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన
మీడియాతో మాట్లాడుతూ.. చదువులమ్మ ఒడిలో పిల్లలందరూ సమానమే. చిన్న వయస్సులో
పిల్లల్లో కులాలు, మతాల చర్చకు తావివ్వకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆ
ప్రకారంగానే స్కూల్ రిజిస్టర్లో కులం, మతం రాయొద్దని అదేశాలిచ్చాం. ఆడ
పిల్లల పేర్లు రెడ్ ఇంక్తో రాయొద్దని ఆదేశించాం. పిల్లల టీసీలు మాత్రం
గతంలో ఇచ్చినట్టే ఇస్తాం
సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. విద్యార్థులకు
ప్రతి పథకాన్ని కులాలు, మతాలకు అతీతంగా ఇస్తున్నాం. సీఎం జగన్ పాలనలో
అన్ని కులాలు, మతాలు సమానమే. సీఎం జగన్ గొప్ప మానవతా దృక్పథంతో ఈ నిర్ణయం
తీసుకున్నారు. పిల్లల్లో కుల, మత, లింగ వివక్షకు తావు లేకుండా చూడాలనే సీఎం
వైఎస్ జగన్ ఈ ఆలోచన చేశారు' అని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు

0 Response to "ఆడ పిల్లల పేర్లు రెడ్ ఇంక్తో రాయొద్దన్నాం"
Post a Comment