రేపటి నుంచే బడి గంటలు
9, 10, ఇంటర్ సెకండియర్ తరగతులు
ఈ ఏడాది 153 జూనియర్ కాలేజీలకు అనుమతి
అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాం: మంత్రి సురేశ్
అమరావతి, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): బడి గంటలు సోమవారం నుంచి మోగనున్నాయని విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేశ్ చెప్పారు. పాఠశాలల అకడమిక్ ఇయర్ ఏప్రిల్తో ముగుస్తుందన్నారు. కోల్పోయిన విద్యా సంవత్సరాన్ని కవ ర్ చేసుకునేలా సిలబస్ రూపకల్పన చేశామన్నారు. కేంద్రం మార్గదర్శకాలను పాటిస్తూ పాఠశాలలు తెరుస్తున్నట్లు చెప్పా రు. శనివారం విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడా రు. అన్ని జాగ్రత్తలతో స్కూళ్లు తెరుస్తున్నామన్నారు. సోమవా రం నుంచి 9, 10, ఇంటర్ సెకండియర్ తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. నవంబరు 16 నుంచి ఇంటర్ ఫస్టియర్ తరగతులు, 23వ తేదీ నుంచి 6, 7, 8 తరగతులు, డిసెంబరు 14వ తేదీ నుంచి 1-5 తరగతులు మొదవుతాయన్నారు. 23 నుంచి రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లు ప్రారంభమవుతాయని తెలిపారు. తల్లిదండ్రులు ఆందోళన చెందకుండా శానిటైజేషన్ జాగ్రత్త చర్యలు తీసుకున్నామన్నారు.
ఇంటర్ అడ్మిషన్లలో గందరగోళం లేదు..
ఇంటర్మీడియెట్ అడ్మిషన్లలో గందరగోళం లేదని మంత్రి సురేశ్ చెప్పారు. 2020-21 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియెట్లో 5,83,740 సీట్లు అందుబాటులో ఉన్నాయని, పదో తరగతి పాసైన వారికి సరిసమానంగా సీట్లు ఉన్నాయని తెలిపారు. ఈ ఏడాది కొత్తగా 153 జూనియర్ కాలేజీలకు అనుమతులు ఇచ్చినట్టు చెప్పారు. రేకుల షెడ్లలో కాలేజీలు నిర్వహిస్తే చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించారు. అందుకే 611 కాలేజీలకు అనుమతులు రద్దు చేశామన్నారు. విద్యా సంస్కరణల్లో భాగంగానే పేరు గొప్ప ఊరు దిబ్బ కాలేజీలకు అనుమతి ఇవ్వలేదన్నారు. షెడ్లు, షాపింగ్ కాంప్లెక్సుల్లో నడిపే కాలేజీలపై కనికరం చూపబోమన్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్లు పాటిస్తూ ఆన్లైన్లో అడ్మిషన్లు ఇస్తున్నామని చెప్పారు. ఫీజులు కూడా 30 శాతం తగ్గించాలని ఆదేశించామన్నారు. ఉన్నత విద్య పరిధిలోని యూజీ, పీజీ కాలేజీలు కూడా సోమవారం నుంచి ప్రారంభమవుతాయని, ఆగస్టుతో అకడమిక్ ఇయర్ ముగుస్తుందన్నారు
0 Response to "రేపటి నుంచే బడి గంటలు"
Post a Comment