విద్యార్థులకు 'మనో దర్పణ్‌ తెలుగు లో మార్గదర్శకాలు

 కోవిడ్‌ -19 మహామ్మారి విజృంభణ సమయంలో కౌమారులు, పాఠశాల స్థాయి విద్యార్థుల మానసిక, సామాజిక, ఆరోగ్య

సంరక్షణకు ఆచరణీయ విధానాలు

కరోనా వైరస్‌ వ్యాధి 19 (కోవిడ్‌-19) ప్రపంచవ్యాప్తంగా మహమ్మారిలా విరుచుకుపడి ప్రతి ఒక్కరి దైనందిక జీవితాలపై సవాలు
విసురుతున్నది. కేవలం తీవ్రమైన శారీరక, ఆరోగ్య సమస్యలే కాక వ్యక్తులలో మానసిక ఒత్తిళ్లను పెంచి భావోద్వేగాలపై ప్రభావం
చూపుతున్నది కోవిడ్‌- 19 ప్రత్యేకించి పాఠశాల వయస్సు పిల్లలపై, కౌమర దశలో ఉన్న యువత, శారీరక అంగవైకల్యాలు గల
పిల్లలపై కోవిడ్‌-19 ప్రభావం తీవ్రంగా ఉన్నది. ఈ ప్రతికూల పరిస్థితులలో వారిలో అధిక ఒత్తిడి, భయాందోళన పెరిగి వారు
భావోద్వేగాల నియంత్రణ కోల్పోయి తీవ్ర మానసిక సమస్యలకు గురి అవుతున్నారు.

వీరి అవసరాలను గుర్తించి తగిన స్థాయిలో మానసిక, శారీరక ఆరోగ్యం పెంపొందించటానికి ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి.
వీరిలో కనపడి కనపడే అనూహ్యమైన మార్పులను గుర్తించి సత్వర నివారణ చర్యలకు విద్యారంగ ప్రతినిధులు అప్రమత్తం అవ్వాలి.
ఈ తరహా సమస్యతో బాధపడుతున్న విద్యార్థులను, కౌమారులను, ప్రత్యేక అవసరాలు ఉన్నవారిని గుర్తించి ఉపాధ్యాయులు, వారి
వారి కుటుంబ సభ్యులు సహానుభూతితో వ్యవహరించి సమస్య తీవ్రతని తగ్గించాలి. కోవిడ్‌- 19 ఉపాధ్యాయులపైనా, తల్లిదండ్రుల
పైనా, పిల్లల సంరక్షకులపైనా కొత్త తరహా ఆందోళన తీవ్రతరం చేస్తున్నది. ఇది వారి అనుకూల దృక్పథంపై ప్రతికూల ప్రభావం
చూపడంతో పిల్లలకి పూర్తిస్థాయిలో మానసిక ఆందోళన సమస్యలు పరిష్కరించలేకపోతున్నారు.

కోవిడ్‌-19 పిల్లల, వారి కుటుంబాల సామాజిక, మానసిక శ్రేయస్సుపై తీవ్రమైన ప్రభావాన్నిచూపిస్తుంది. దేశవ్యాప్తంగా
పాఠశాల స్థాయి విద్యార్థులకు, కౌమారదశ యువతకూ, ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు మానసిక సామాజిక మద్దతు
తెలపటానికి (మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ) విద్యా మంత్రిత్వ శాఖ “మనోదర్పణ్‌” (హృదయ దర్పణం) అనే వినూత్న
ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. పిల్లలకు వివిధ దశలలో, వివిధ స్థాయిలో వివిధ కృత్యాల ద్వారా సమగ్రమైన మానసిక సామాజిక
మద్దతు అందజేయడం మనోదర్పణ్‌( హృదయ దర్పణం ) ప్రధాన ఉద్దేశ్యం.
విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఆచరణీయ విధానాలు
నవీకరించబడిన - ధ్రువపరిచిన సమాచారాన్ని పిలల వయస్సు ఆధారంగా తగినంత అందజేయడం. వైద్య అధికారుల నుండి
సేకరించిన కోవిడ్‌ -19కు సంబంధించిన సమాచారాన్ని ఎటువంటి అపోహలకూ తావివ్వకుండా వాస్తవాలను తెలియజేయుట.
భయాందోళననూ, ఒత్తిడిని తగ్గించే విధంగా కోవిడ్‌- 19 సమాచారాన్ని అందజేయడం, కోవిడ్‌-19 సమాచారాన్నిరోజుకి రెండు
మూడు నిర్దిష్ట సమయాలలో యథార్థమైన తాజా సమాచారాన్ని అందజేయడం. తప్పుదోవ పట్టించే సమాచారాన్ని
నియంత్రించటం వంటివి పాటించాలి.

* చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం, దగ్గు, తుమ్ములు వచ్చినప్పుడు చేతి రుమాలు అడ్డం పెట్టుకోవడం అకస్మాత్తుగా
వచ్చే తుమ్ముకీ, దగ్గుకీ మోచేయి అడ్డు పెట్టుకోవడం, సామాజిక సమూహాలకు దూరంగా ఉండటం వంటివి ప్రధానంగా
ఆచరించాలి.

౨ సామాజిక మాధ్యమాలను, టెలివిజన్‌ వీక్షించే సమయానికి పరిధిలు విధించుకోవాలి. కేవలం విశ్వసనీయ వర్గాల ద్వారా
అందిన సమాచారాన్ని మాత్రమే స్వీకరించాలి.

౨ కోవిడ్‌-19 మహమ్మారితో పోరాడి ఆరోగ్యంగా తిరిగి వచ్చిన వారితో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయటం,
అనుకూల దృక్పథంతో వారి విజయగాథలను తెలుసుకుని అమలుపరచాలి. ఉదాహరణకు ఇటీవల కేరళలో కోవిడ్‌-


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "విద్యార్థులకు 'మనో దర్పణ్‌ తెలుగు లో మార్గదర్శకాలు"

Post a Comment