ఆదాయపన్ను రిటర్న్ల గడువు పొడిగింపు
దిల్లీ:
ఆదాయపన్ను చెల్లింపు దారులకు వెసులుబాటు కలిగిస్తూ ఆర్థిక శాఖ ఓ
నిర్ణయానికి వచ్చింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయపన్ను
రిటర్న్ల దాఖలుకు చివరి గడువును పొడిగించింది. ఈ నిర్ణయంతో ఉద్యోగులు తమ
వ్యక్తిగత ఆదాయ పన్ను రిటర్న్లను డిసెంబర్ 31 లోగా చెల్లించే వీలు
కలుగుతుంది. ఇక ఆడిటింగ్ అనంతరం పన్ను చెల్లించేవారు మరో నెల అనంతరం అంటే
జనవరి 31, 2021 లోగా సమర్పించవచ్చని ఆ శాఖ తెలిపింది
ఈ మేరకు
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ విడుదల చేసిన ఓ ప్రకటనలో..
‘‘ప్రభుత్వ నిబంధనల ప్రకారం జులై 31, 2020న ఆదాయ పన్ను రిటర్న్లను నమోదు
చేయాల్సిన చెల్లింపుదారులకు గడువు తేదీని డిసెంబర్ 31, 2020 దాకా
పొడిగించారు. అదే విధంగా ఆడిటింగ్ చేసిన ఖాతాల ఆధారంగా ఆదాయ పన్ను
చెల్లించే వారికి చివరి తేదీని జనవరి 31, 2021గా నిర్ణయించారు.’’ అని
తెలిపింది. కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో పన్ను చెల్లింపు దారులకు మరింత
సమయం ఇచ్చే ఉద్దేశంతో ఈ నిర్ణయానికి వచ్చినట్టు ఆర్థికశాఖ వివరించింది
0 Response to "ఆదాయపన్ను రిటర్న్ల గడువు పొడిగింపు"
Post a Comment