ఏపీలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల

అమరావతి: గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. హైకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఫలితాలు వెల్లడించినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. ఈ మేరకు గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌ psc.ap.gov.inలో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించింది.



ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలను విడుదల చేయడంతో మెయిన్స్‌ పరీక్ష నిర్వహణకు అడ్డంకులు తొలగిపోయాయి. వాయిదా పడిన గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల రీషెడ్యూల్‌ తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. నవంబర్‌ 2 నుంచి 13 వరకు జరగాల్సిన మెయిన్స్‌ పరీక్షలను ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీపీఎస్సీ వాయిదా వేసిన విషయం తెలిసిందే. వాయిదా వేసిన పరీక్షలను డిసెంబర్‌ 14 నుంచి 20 వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది. నవంబర్‌ 21 నుంచి 29 వరకు ప్రభుత్వ ఉద్యోగులకు డిపార్ట్‌మెంటల్‌‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు  వెల్లడించింది. సంస్థ వెబ్‌సైట్‌ psc.ap.gov.inలో రీషెడ్యూల్డ్‌ తేదీలను అందుబాటులో ఉంచినట్లు ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో పేర్కొంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " ఏపీలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల "

Post a Comment