అంగన్‌వాడీల రూపురేఖలు మారాలి

నాడు-నేడుపై సమీక్షలో సీఎం జగన్‌


అమరావతి, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అంగన్‌వాడీలకు 27,438 కొత్త భవనాల నిర్మాణం చేపట్టాల్సి ఉందని, తొలి దశలో 17,984, రెండో దశలో 9,454 భవనాలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి జగన్‌ అధికారులను ఆదేశించారు.



తొలిదశ పనులను ఈ డిసెంబరులో, రెండో దశ పనులను వచ్చే నవంబరులో ప్రారంభించాలని సూచించారు. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా అంగన్‌వాడీలపై బుధవారం ఆయన సమీక్షించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొలిదశ పనులు వచ్చే ఏడాది జూన్‌ నెలాఖరుకు పూర్తికావాలని స్పష్టంచేశారు. అంగన్‌వాడీల రూపురేఖలు పూర్తిగా మార్చేయాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడొద్దని అన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "అంగన్‌వాడీల రూపురేఖలు మారాలి"

Post a Comment