ఈపీఎఫ్‌ వడ్డీ రెండు వాయిదాల్లో వడ్డీ చెల్లింపు

  • తొలుత 8.15శాతం
  • డిసెంబరులో 2వ వాయిదాగా 0.35శాతం
  • ట్రస్టీ సమావేశంలో నిర్ణయం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 9: దాదాపు ఆరు కోట్ల మంది ఈపీఎఫ్‌ ఖాతాదారులకు గత ఆర్థిక సంవత్సరానికి (2019-20) సంబంధించిన 8.5 శాతం వడ్డీని రెండు వాయిదాల్లో చెల్లించాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎ్‌ఫఓ) కేంద్ర బోర్డు బుధవారం నిర్ణయించింది. ఈ మేరకు 8.15 శాతం వడ్డీని మొదట, 0.35 శాతం వడ్డీని ఈ ఏడాది డిసెంబరులో ఖాతాదారుల అకౌంట్‌లో జమ చేయనున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రెండు వాయిదాల్లో వడ్డీ రేటు చెల్లించాల్సిన అవసరం ఏర్పడుతోందని ఈపీఎ్‌ఫఓ సెంట్రల్‌ బోర్డు ట్రస్టీ ఒకరు తెలిపారు



వాస్తవానికి ఈపీఎ్‌ఫఓ ట్రస్టీల సమావేశ అజెండాలో వడ్డీ రేటుకు సంబంధించిన అంశంలేదని, అయితే కొంత మంది ట్రస్టీలు వడ్డీ జమ చేయడంలో జాప్యం చేసిన అంశాన్ని లేవనెత్తడంతో వడ్డీ చెల్లింపు విషయమై నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 8.5 శాతం వడ్డీ రేటును చెల్లించడానికిగాను ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌లోని కొన్ని పెట్టుబడులను నగదుగా మార్చుకోవాలని ఈపీఎ్‌ఫఓ యోచించింది. అయితే కరోనా లాక్‌డౌన్‌ కారణంగా అది జరగలేదు. 2019-20 సంవత ్సరానికి 8.5 శాతం వడ్డీ చెల్లించగా.. ఈపీఎ్‌ఫఓ వద్ద రూ.700 కోట్ల మిగులు ఉంటుందని అంచనా. కరోనా నేపథ్యంలో ఈపీఎ్‌ఫఓ రాబడులపై ప్రభావం పడినట్టు తెలుస్తోంది. డివిడెండ్ల ద్వారా, ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ విక్రయాల వల్ల మంచి రాబడులు వస్తాయని ఈపీఎ్‌ఫఓ ముందు అంచనా వేసింది. అయితే మార్కెట్‌  నిరాశాజనకంగా ఉండటంతో ఆదాయం తగ్గింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

Related Posts :

0 Response to "ఈపీఎఫ్‌ వడ్డీ రెండు వాయిదాల్లో వడ్డీ చెల్లింపు"

Post a Comment