ఏపీలో కరోనా విజృంభణ

అమరావతి: కరోనా కేసుల్లోనూ ఏపీ దూసుకుపోతోంది. పది రోజుల నుంచి వరుసగాపది వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 10,825 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి మొత్తం ఏపీలో 4,87,331కు కరోనా కేసులు చేరాయి. ప్రస్తుతం ఏపీలో 1,00,880 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుంచి కోలుకుని 3,82,104 మంది రికవరీ అయ్యారు. ఏపీలో ఇప్పటివరకు 40.35 లక్షల కరోనా టెస్టులు నిర్వహించారు. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు కరోనాతో 71 మంది మృతి చెందారు. ఇప్పటివరకు ఏపీలో కరోనా వల్ల 4,347 మరణాలు సంభవించాయి. 



నెల్లూరు 13, అనంతపురం 8, పశ్చిమగోదావరి జిల్లాలో 8 మంది మృతి చెందారు. చిత్తూరు 7, గుంటూరు 7, విజయనగరం 6, ప్రకాశం 5, విశాఖ 5 మంది చొప్పున మృతి చెందారు. కృష్ణా 4, కడప 3, కర్నూలు 2, శ్రీకాకుళం 2, తూర్పుగోదావరి జిల్లాలో ఒకరు మృతి చెందారు. ఈ రోజు అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1,399 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రకాశం 1,032, పశ్చిమగోదావరి జిల్లాలో 1,103 నెల్లూరు 1,046, కడప 1,039 కేసులు నమోదయ్యాయి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఏపీలో కరోనా విజృంభణ"

Post a Comment