అక్టోబరు 5 నుంచి స్కూళ్లు ప్రారంభం
- సెట్స్’ నిర్వహణకు సర్వం సిద్ధం
- విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్
అమరావతి, సెప్టెంబరు
8ఉమ్మడి ప్రవేశ పరీక్షల(సెట్స్) నిర్వహణకు సర్వం సిద్ధం చేశామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. మంగళవారం మంగళగిరిలోని ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఆ యన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 10-11 తేదీల్లో ఐసెట్తో ఈ పరీక్షలు ప్రారంభమవుతాయని, ఐసెట్కు 64,884 మంది రిజిస్టర్ చేసుకున్నట్లు చెప్పారు. ఈ నెల 14న జరిగే ఈసెట్కు 37,167 మంది, 17-25 తేదీల్లో నిర్వహించే ఎంసెట్ కు 2,72,720 మంది, 28-30తేదీల్లో జరిగే పీజీఈసెట్కు 28,291 మంది, అక్టోబరు 1న జరిగే ఎడ్సెట్కు 14,786 మం ది, లాసెట్కు 17,809 మంది, అక్టోబరు 2-5 తేదీల్లో నిర్వహించే పీఈసెట్కు 2,908 మంది రిజిస్టర్ అయ్యారని వివరించారు. కొవిడ్-19మార్గదర్శకాల మేరకే ఈ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. విద్యార్థులకు హెల్ప్లైన్ ఏర్పాటు చే స్తున్నామని, హాల్టికెట్తో పాటు పరీక్ష సెంటర్ రోడ్ మ్యాప్ కూడా అందిస్తామని తెలిపారు
అక్టోబరు 5న స్కూళ్లు ప్రారంభించే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. అన్లాక్-5
మార్గదర్శకాలు వచ్చిన అనంతరం నిర్ణయం తీసుకుంటామ ని చెప్పారు. విద్యా కానుక
కిట్లను సిద్ధం చేశామని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ మోడల్ కరిక్యులమ్
తీసుకొచ్చామని, సీఎం జగన్ ఆలోచన మేరకు స్కిల్ డెవల్పమెంట్,
ఇంటర్న్షి్పతో సంస్కరణలు తీసుకొచ్చినట్లు వివరించారు. కాగా, రాష్ట్రానికి
3 రాజధానులు ఉంటాయని సీఎం జగన్ చెప్పార ని.. తాము ఆ మాటకు కట్టుబడి
ఉన్నామని మంత్రి సురేశ్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం పథకాలకు పేరు
మారుస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు.
వైఎస్సార్ సంపూర్ణ పోషణలో.. గతంలో ఇచ్చిన మెనూకు, ఇప్పటి మెనూకు తేడా
గమనించాలన్నారు
0 Response to "అక్టోబరు 5 నుంచి స్కూళ్లు ప్రారంభం"
Post a Comment