పాఠశాలల విద్యార్థులకు మాస్కులు: ఎస్ఎ్సఏ
నర్సీపట్నం, ఆగస్టు 24:
విద్యా సంస్థలను వచ్చే నెల ఐదో తేదీన పునఃప్రారంభించాలని భావిస్తున్న
రాష్ట్ర ప్రభుత్వం, కరోనా నేపథ్యంలో ప్రతి విద్యార్థికి మాస్కులు పంపిణీ
చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సమగ్ర శిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు
డైరెక్టర్ కె.వెట్రిసెల్వీ ఆదేశాలు జారీ చేశారు.
ఒకటి నుంచి పదో తరగతి
వరకు విద్యార్థుల వయసునుబట్టి మూడు సైజుల్లో మాస్కులు తయారు చేస్తున్నారు. ఈ
నెలాఖరునాటికి మాస్కులు సిద్ధం చేసి ఎంఈఓలకు అందజేయాలని, వారి నుంచి
పాఠశాలల ప్రధానోపాధ్యాయులు స్వీకరించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు 42,34,322
మంది
విద్యార్థులు(2019-20 విద్యా సంవత్సరంలో చదివిన విద్యార్థుల సంఖ్యను
ఆధారంగా చేసుకుని) ఉన్నారు. ఒక్కొక్కరికి మూడేసి చొప్పున మొత్తం
1,27,02,926 మాస్కులు సిద్ధం చేయాలని గ్రామీణ పేదరిక నిర్మూలన
సంస్థ(సెర్ప్) సీఈఓను ఆదేశించారు
0 Response to "పాఠశాలల విద్యార్థులకు మాస్కులు: ఎస్ఎ్సఏ"
Post a Comment