బడుల ప్రారంభంపై సందిగ్ధం



హైదరాబాద్‌, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో పాఠశాలల పునఃప్రారంభంపై సందిగ్ధం నెలకొంది. సాధారణంగా అయితే జూన్‌ 12 నుంచి బడులు తె రుచుకోవాలి. కానీ కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఇది సాధ్యమయ్యేట్టు లేదు. 


కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ జూన్‌ 30 వరకు ఉండటం, కరోనా కేసులు పెరగడం వంటి పరిణామాల నేపథ్యంలో పాఠశాలల ప్రారంభానికి సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టత వస్తుందని భావించిన ఉపాధ్యాయవర్గాల్లో అయోమయం నెలకొంది. గురువారం రాత్రి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు. రాష్ట్రంలో పాఠశాలలు తెరిచే పరిస్థితి లేకున్నా ప్రభుత్వం ఒక స్పష్టత ఇవ్వాల్సిందని ఉపాధ్యాయులు అంటున్నారు.


శుక్రవారం నుంచి పాఠశాలలకు ఉపాధ్యాయులు మాత్రమే వెళ్లాలా? ప్రారంభ తేదీ వాయిదా వేశారా? అన్న విషయాల్లో స్పష్టత లేకపోవడం ఉపాధ్యాయులను అయోమయానికి గురి చేస్తోంది. ఈ విషయంపై అనేక మంది ఉపాధ్యాయులు సంఘాలను సంప్రదించారు. వారు విద్యా శాఖ అధికారులను సంప్రదించినా ఎలాంటి సమాధానం రాలేదు. విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ ప్రస్తుతం సెలవులో ఉన్నారు.


 ఆమె సోమవారం విధులకు హాజరుకానున్నారు. అప్పటి వరకు దీనిపై ఎలాంటి స్పష్టత వచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. పాఠశాలల పునఃప్రారంభంపై విద్యా శాఖ ఉన్నతాధికారులను సంప్రదించినప్పటికీ ఎలాంటి సమాధానం లేదని టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి తెలిపారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "బడుల ప్రారంభంపై సందిగ్ధం"

Post a Comment