స్కూళ్లని తెరవడమెలా?
- రాష్ట్రాలతో చర్చించిన కేంద్ర విద్యాశాఖ
న్యూఢిల్లీ, జూన్ 8: కరోనా కారణంగా మార్చి చివరి నుంచి మూతబడిన పాఠశాలలను తిరిగి తెరవడంపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. దీనికి సంబంధించి కేంద్ర హెచ్చార్డీ శాఖ వివిధ రాష్ట్రాలు, ఇతర సంబంధీకులతో చర్చలు ప్రారంభించింది.
కేంద్ర పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి అనితా కర్వాల్ అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో పలు రాష్ట్రాల విద్యాశాఖ కార్యదర్శులు పాల్గొన్నారు
. ఈ సమావేశంలో అధికారులు చేసిన సూచనలను పరిశీలించి కేంద్ర ఆరోగ్య, హోం శాఖలకు పంపిస్తామని కేంద్ర హెచ్చార్డీ శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ చెప్పారు
0 Response to "స్కూళ్లని తెరవడమెలా?"
Post a Comment