నేడు రాత్రి పి.యం ప్రసంగం లాక్ డౌన్ పై కీలక ప్రకటన వెలువడే అవకాశం
లాక్ డౌన్ 4 మే18 కి ముందు ప్రకటన
కొత్త నిబందనలతో లాక్ డౌన్ 4 ప్రకటన జరుగును.
Lockdown 4.0 will be based on suggestions by states, all details will be out before May18
Corona is here to stay for a long time. Lockdown 4.0 will be entirely different: PM
ప్రస్తుతం ప్రకటించలేదు.
ప్యాకేజీతో చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఊతం
ఈ ప్యాకేజీపై రేపట్నుంచి ఆర్థికమంత్రి వివరాలు అందిస్తారు. చిన్న, మధ్యతరహా
పరిశ్రమలకు ఆర్థిక ప్యాకేజీ ద్వారా ఊతమిస్తాం. భారత్ సర్కార్ నుంచి
వెళ్లే ప్రతి రూపాయీ ప్రతి శ్రామికుడు, రైతు జేబులోకి నేరుగా వెళ్తుంది.
21వ శతాబ్దపు ఆకాంక్షలకు తగినట్టు ఈ ప్యాకేజీ రూపకల్పన. నూతన ఉద్యోగ, ఉపాధి
అవకాశాల కల్పనకు దోహదం చేస్తుంది. ఆర్థిక ప్యాకేజీపై కరోనా పోరాటంలో
ప్రతిఒక్కరికీ చేయూతనిస్తుంది. దేశంలో ప్రతి పారిశ్రామికుడిని కలుపుకొని
పోయేలా ప్యాకేజీ ఉపయోగపడుతుంది. భారత పారిశ్రామిక రంగానికి మరింత బలాన్ని
చేకూర్చేందుకు ప్యాకేజీ ఉపయోగకరంగా ఉంటుంది’’ అని తెలిపారు.
మరో కొత్త విప్లవానికి నాంది
‘‘జన్ధన్ అభియాన్తో ఒక విప్లవాన్ని చూశాం. ఇప్పుడు మరో కొత్త
విప్లవానికి నాంది పలకబోతున్నాం. భవిష్యత్తులో వ్యవసాయంపై ప్రభావం పడకుండా
ఏర్పాట్లు. బలమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణం, పెట్టుబడుల ఆకర్షణకు ఆలంబనగా
నిలుస్తుంది. జన్ధన్, ఆధార్, మొబైల్ (జామ్) సూత్రం ఎంతో ఉపయోగపడింది.
ప్రపంచ పపిణీ వ్యవస్థలో భారత్ది కీలక పాత్ర. మేకిన్ ఇండియా కల సాకారం
చేయడానికి ఈ ప్యాకేజీ దోహదం చేస్తుంది. మన సామర్థ్యం, నాణ్యత అన్నింట్లోనూ
నూతన ప్రమాణాలకు నాంది పలుకుతుంది. నాలుగో దశ లాక్డౌన్కు కొత్త రూపురేఖలు
ఇద్దాం. స్థానిక మార్కెట్లు, స్థానిక పంపిణీ వ్యవస్థలు బలోపేతం కావాలి’’
అన్నారు
ప్రపంచ దేశాల్ని ఆదుకోవడంలో భారత్ ముందుంటుంది
‘‘కరోనా
నుంచి మనల్ని మనం రక్షించుకుంటూ ముందుకు సాగాలి. కరోనాకు ముందు కరోనా
తర్వాత అని విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. భారత్లో కూడా అనేకమంది
అయినవారిని కోల్పోయారు. ఒకే ఒక్క వైరస్ ప్రపంచాన్ని తలకిందులు చేసింది.
ప్రపంచం మొత్తం ప్రాణం కోసం యుద్ధం చేస్తోంది. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ
చూడలేదు.. వినలేదు. మన పోరాట సంకల్పాన్ని మరింత బలపరుచుకోవాలి. ప్రపంచ
వ్యాప్తంగా నేటి పరిస్థితి నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉంది. ప్రపంచ
మానవాళికి ఇదో పెద్ద సవాల్. ఒక చినన వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది.
ఇలాంటి పరిస్థితిని మునుపెన్నడూ చూడలేదు. కరోనాతో వచ్చిన సవాళ్లను మనం
అధిగమించాం.. అప్పుడు మన దగ్గర ఒక్క పీపీఈలు, N -95 మాస్క్లు ఉత్పత్తి
కాలేదు. కానీ ఇప్పుడు వాటిని లక్షల్లో తయారు చేస్తున్నాం. రోజూ 2లక్షల
పీపీఈ కిట్లు, 2లక్షల N - 95మాస్కుల్ని తయారుచేస్తున్నాం. వసుధైక కుటుంబం
భావనలో ప్రపంచ దేశాల్ని ఆదుకొనేందుకు భారత్ ముందుంటుంది’’ అని చెప్పారు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా విధించిన లాక్డౌన్ మే 17తో ముగియనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి జాతినుద్దేశించి మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా 42 లక్షల మందికి కరోనా సోకిందని, దాదాపు 2 లక్షల 75 వేల మంది మరణించారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కరోనా మొత్తం ప్రపంచాన్ని అస్తవ్యస్తం చేసిందన్నారు. తమ జీవితంలో ఎవరూ ఇలాంటి ఉపద్రవాన్ని కనీవిని ఎరుగరని మోదీ తెలిపారు. మానవజాతికి ఇది ఊహాతీతమని.. అలసిపోవద్దు, ఓడిపోవద్దు, కుంగిపోవద్దు, పోరాటంతోనే ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సంక్షోభం కంటే మన సంకల్పం గొప్పది అన్నారు.(70 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య)
‘ఈరోజు ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీని ప్రకటిస్తున్నాను. 20లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజీని ప్రకటిస్తున్నాను. ఇది మన జీడీపీలో 10శాతం. ఈ ఆర్థిక ప్యాకేజీలో అన్ని వర్గాల వారిని పరిగణలోకి తీసుకున్నాము. చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు, వ్యాపారులు, రైతులు.. ఉద్యోగులు శ్రామికుల్లో ఆత్మ స్థైర్యం నింపేందుకే ఈ ప్యాకేజీ. రేపటి నుంచి ఈ ప్యాకేజీకి సంబంధించి అన్ని వివరాలు ప్రకటిస్తాం’ అని మోదీ పేర్కొన్నారు.
‘ఈ యుద్దంలో ప్రతీ ఒక్కరు నియమ నిబంధనలను పాటించాలి. కరోనా కంటే ముందుగా ఉన్న ప్రపంచం ఏంటో మనకు తెలుసు. కరోనా సంక్షోభం తరువాత మారుతున్న ప్రపంచాన్ని మనం చూస్తున్నాం. ఆత్మా నిర్భర్ భారత్... మన లక్ష్యం కావాలి. శాస్త్రాలు చెప్పింది కూడా ఇదే. కరోనా ప్రారంభం అయినప్పుడు, దేశంలో ఒక్క పీపీఈ కిట్ కూడా తయారయ్యేది కాదు. నేడు భారత్లో ప్రతీ రోజు 2లక్షల పీపీఈ కిట్స్, 2లక్షల ఎన్-95 మాస్క్లు తయారవుతున్నాయి. ఆపదను అవకాశంగా మార్చుకున్నాము. స్వయం సంవృద్ధి సాధించే దిశలో భారత్ వేగంగా ముందుకు పోతోంది. భారత సంస్కృతి, సాంప్రదాయం మన స్వయం సంవృద్ది గురించి చెబుతాయి. మొత్తం ప్రపంచాన్ని కుటుంబంగా చూసే సంస్కృతి మనది. ఈ భూమిని తల్లిగా భావించే ఆలోచన ఈ దేశానిది. అలాంటి మన దేశం స్వయం సంవృద్ది వైపు సాగితే. దీని ప్రభావం మొత్తం ప్రపంచానికి శుభపరిణామం’ అని మోదీ అన్నారు. (లాక్డౌన్ కొనసాగుతుంది.. అయితే)
సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రధాని దృష్టికి సీఎంలు అనేక సమస్యలను తీసుకువచ్చారు. ఇక లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించడం ఇది మూడోసారి
అప్రమత్తంగా ఉంటూ ముందుకు సాగాలి : మోదీ
న్యూఢిల్లీ : కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా విధించిన లాక్డౌన్ మే 17తో ముగియనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి జాతినుద్దేశించి మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా 42 లక్షల మందికి కరోనా సోకిందని, దాదాపు 2 లక్షల 75 వేల మంది మరణించారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కరోనా మొత్తం ప్రపంచాన్ని అస్తవ్యస్తం చేసిందన్నారు. తమ జీవితంలో ఎవరూ ఇలాంటి ఉపద్రవాన్ని కనీవిని ఎరుగరని మోదీ అన్నారు. మానవజాతికి ఇది ఊహాతీతమని.. అలసిపోవద్దు, ఓడిపోవద్దు, కుంగిపోవద్దు, పోరాటంతోనే ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సంక్షోభం కంటే మన సంకల్పం గొప్పది అన్నారు. సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రధాని దృష్టికి సీఎంలు అనేక సమస్యలను తీసుకువచ్చారు. ఇక లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించడం ఇది మూడోసారి. ‘ఈ యుద్దంలో ప్రతీ ఒక్కరు నియమ నిబంధనలను పాటించాలి. కరోనా కంటే ముందుగా ఉన్న ప్రపంచం ఏంటో మనకు తెలుసు. కరోనా సంక్షోభం తరువాత మారుతున్న ప్రపంచాన్ని మనం చూస్తున్నాం. ఆత్మా నిర్భర్ భారత్... మన లక్ష్యం కావాలి. శాస్త్రాలు చెప్పింది కూడా ఇదే. కరోనా ప్రారంభం అయినప్పుడు, దేశంలో ఒక్క పీపీఈ కిట్ కూడా తయారయ్యేది కాదు. నేడు భారత్లో ప్రతీ రోజు 2లక్షల పీపీఈ కిట్స్, 2లక్షల ఎన్-95 మాస్క్లు తయారవుతున్నాయి. ఆపదను అవకాశంగా మార్చుకున్నాము. స్వయం సంవృద్ధి సాధించే దిశలో భారత్ వేగంగా ముందుకు పోతోంది. భారత సంస్కృతి, సాంప్రదాయం మన స్వయం సంవృద్ది గురించి చెబుతాయి. మొత్తం ప్రపంచాన్ని కుటుంబంగా చూసే సంస్కృతి మనది. ఈ భూమిని తల్లిగా భావించే ఆలోచన ఈ దేశానిది. అలాంటి మన దేశం స్వయం సంవృద్ది వైపు సాగితే. దీని ప్రభావం మొత్తం ప్రపంచానికి శుభపరిణామం’ అని మోదీ అన్నారు.
ముఖ్యాంశాలు
20లక్షల కోట్లు ఆర్థిక ప్యాకేజి
*ఆత్మ నిర్భర్ భారత అభియాన్*** పేరుతో
రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన ప్రధాని మోడీ
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ భారతదేశం నేడు అన్ని రంగాల్లో సత్తాను చాటుకుంటోంది.
స్వయం సమృద్ధి సాధించి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది. కరోనా సమయంలో భారతీయ ఔషధాలు ఎంతో ప్రభావవంతంగా పని చేస్తున్నాయి.
*21వ శతాబ్దం మనదే. ఆత్మ నిర్భర భారతదేశమే మన లక్ష్యం*
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తున్నారు. 4 నెలలుగా కరోనాతో పోరాడుతున్నామని, ప్రపంచవ్యాప్తంగా 42 లక్షల మందికి కరోనా సోకిందని మోదీ చెప్పారు. ఒక్క వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోందని, ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రపంచం యుద్ధం చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. 2 లక్షల 88 వేల మంది కరోనా కారణంగా చనిపోయారని మోదీ గుర్తుచేశారు.
ఓడిపోవడం, కుంగిపోవడం మానవాళికి ఇష్టం లేదని, మరింత ధృడ సంకల్పంతో మనం ముందుకెళ్లాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఈ సంక్షోభం కంటే మన సంకల్పం గొప్పదని మోదీ అన్నారు. ప్రస్తుతం మనం చాలా కీలకమైన దశలో ఉన్నామని ఆయన చెప్పారు. రోజుకు 2 లక్షల చొప్పున పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్క్ల తయారీ మొదలైనట్లు ప్రధాని తెలిపారు. ప్రాణాలను కాపాడుకుంటూనే ముందుకెళ్లాలని మోదీ వ్యాఖ్యానించారు.
: ఈనెల 17తో లాక్డౌన్ ముగియనున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఇవాళ రాత్రి 8గంటలకు మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తారని ప్రధాని కార్యాలయం తెలిపింది. ఈ సందర్భంగా ప్రధాని లాక్డౌన్ సడలింపులు, కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలపై కీలక ప్రకటన చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో మోదీ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది
దేశంలో కరోనా కట్టడిపై ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలు ఏవిధంగా ఉన్నాయి... ఎలాంటి సత్ఫలితాలనిచ్చాయనే విషయాలను మోదీ తన ప్రసంగంలో ప్రస్తవించనున్నట్లు సమాచారం. నిన్న వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనేక విషయాలు చర్చించారు. ఆర్థిక పరమైన కార్యకలాపాలు కొనసాగించేందుకు చర్యలను మరింత ముమ్మరం చేయాల్సిన అవసరాన్ని ఈ సందర్బంగా సీఎంలు స్పష్టం చేశారు. అదే సందర్భంలో కరోనాను ఎదుర్కొనే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ముందుకు వెళ్లేలా సూచనలు, సలహాలు ఈనెల 15లోపు ఇవ్వాలని అన్ని రాష్ట్రాల సీఎంలకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి పరిస్థితుల్లో దేశంలో లాక్డౌన్ అమలు చేస్తున్నామనేది ప్రధాని తన ప్రసంగం ద్వారా నేడు ప్రజలకు వివరించే అవకశాముంది. వైద్యపరంగా ఇప్పటి వరకు వచ్చిన అంశాలన్నింటినీ పరిశీలిస్తున్నామని చెప్పటంతో పాటు దేశ ప్రజల నుంచి కూడా పలు సూచనలు, సలహాలు కోరే ఆస్కారం కనిపిస్తోంది. లాక్డౌన్ -3 కొనసాగించాలా? కొనసాగిస్తే ఎక్కడెక్కడ కొనసాగించాలి? .. ఈ అంశాలపై ప్రధాని ప్రసంగంలో స్పష్టత ఇచ్చే అవకాశముంది.
వలస కూలీల వ్యవహారంపై..
వలస కూలీల వ్యవహారంపై మోదీ తన ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు సమాచారం. పలువురు కూలీలు ఇటీవల చోటు చేసుకున్న రైలు ప్రమాదంలో మృతి చెందారు. మరికొంత మంది స్వస్థలాలకు నడిచి వెళ్తూ మరణించారు. వలస కూలీలు తమ ప్రాంతాలకు వెళ్లేందుకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకోవడం లేదు. మరి కొన్ని రాష్ట్రాలు వచ్చిన వారి విషయంలో అలసత్వం ప్రదర్శించడంపై ప్రధాని అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు పలు చోట్ల లాక్డౌన్ నిబంధనల అమలులో ప్రజలు ఇష్టా రీతిలో వ్యవహరించడంపై కూడా ప్రధాని మాట్లాడే అవకాశముంది
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. దీనికి సంబంధించి ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. మోదీ నిన్ననే అన్ని రాష్ట్రాల సీఎంలతో ఐదోసారి చర్చించారు. మెజారిటీ సీఎంలు లాక్డౌన్ కొనసాగించాలని కోరారు. దీంతో మరోసారి లాక్డౌన్ పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దేశంలో ప్రస్తుతం మూడోదశ లాక్డౌన్ కొనసాగుతోంది. ఈ నెల 17తో ఇది ముగియనుంది. మార్చి నెల 24 అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన లాక్డౌన్ తొలిదశ 21 రోజుల పాటు కొనసాగింది. ఏప్రిల్ 15న మరో 19 రోజుల పాటు లాక్డౌన్ పొడిగించారు. ఆ తర్వాత మరో రెండు వారాలు పొడిగించారు. నేడు మరో రెండు వారాలు లాక్డౌన్ పొడిగిస్తారని భావిస్తున్నారు. రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని చేసే ప్రసంగంలో వివిధ రంగాలకు ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి. కరోనా నేపథ్యంలో జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగించడం ఇది ఐదోసారి
0 Response to "నేడు రాత్రి పి.యం ప్రసంగం లాక్ డౌన్ పై కీలక ప్రకటన వెలువడే అవకాశం"
Post a Comment