చదువులకో టీవీ ఛానల్! సమగ్ర శిక్ష అభియాన్ తరఫున ప్రతిపాదన
చదువులకో టీవీ ఛానల్!
సమగ్ర శిక్ష అభియాన్ తరఫున ప్రతిపాదన
: విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు ప్రత్యేక టీవీ ఛానల్ ఏర్పాటుకు సమగ్రశిక్ష అభియాన్ కేంద్రానికి ప్రతిపాదించింది
. ప్రస్తుతం యాప్లు, యూట్యూబ్ వంటి మాధ్యమాలున్నా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో ఉండడం, పేదవారు కావడం వల్ల అంతర్జాల సదుపాయం లేక పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారు. దీంతో 24గంటలు విద్యపై పని చేసే టీవీ ఛానల్ను ఏర్పాటు చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. ఛానల్ ఏర్పాటుకు రూ.3కోట్లు, నిర్వహణకు ఏడాదికి రూ.40 లక్షల నుంచి రూ.50లక్షలు అవసరమవుతాయని అంచనా వేసింది.
ప్రతిపాదనల్లో ముఖ్యాంశాలు..
* ఈ ఏడాది సమగ్ర శిక్ష అభియాన్ కింద రూ.3వేల కోట్ల బడ్జెట్కు ప్రతిపాదనలు రూపొందించింది. * అందులో కొవిడ్-19 కారణంగా ఒక్కో విద్యార్థికి ఏడాదికి పది మాస్కులు, ఆరు శానిటైజర్ సీసాలు అవసరమని అంచనా వేసింది.
తరగతి గదుల పారిశుద్ధ్యానికి ప్రత్యేక నిధులు ప్రతిపాదించింది. * ఈ ఏడాది 9, 10 తరగతుల విద్యార్థులకూ ఏకరూప దుస్తులు ఇవ్వాలని పేర్కొంది. *
జూన్ 9న కేంద్ర ప్రాజెక్టు అనుమతుల బోర్డు(పీఏబీ) వీడియో కాన్ఫరెన్సులో ఈ ప్రతిపాదనలపై నిర్ణయం వెల్లడించనుంది.
0 Response to "చదువులకో టీవీ ఛానల్! సమగ్ర శిక్ష అభియాన్ తరఫున ప్రతిపాదన"
Post a Comment