పదోతరగతి పరీక్షలకు అదనపు కేంద్రాలు

పదోతరగతి పరీక్షలకు అదనపు కేంద్రాలు 

 వ్యక్తిగత దూరం పాటిస్తే రెట్టింపు కానున్న కేంద్రాలు  

, అమరావతి: వ్యక్తిగత దూరం పాటిస్తూ పదో తరగతి పరీక్షల నిర్వహణకు పాఠశాల విద్యా శాఖ సమాయత్తమవుతోంది.




 దీనికోసం ప్రస్తుతం గుర్తించిన పరీక్ష కేంద్రాలు దాదాపు రెట్టింపు అవసర మవుతాయి. దూరం పాటిస్తూ పరీక్షలు నిర్వహించేం దుకు ఎన్ని కేంద్రాలు కావాలనే వివరాలను పంపాలని డీఈవోలను ఉన్నతాధికారులు ఆదేశించారు. ప్రస్తుతం గుర్తించిన కేంద్రాల్లోనే సర్దుబాటు చేయడం, సమీపంలోనే మరో పాఠశాలలో కేంద్రం ఏర్పాటు, కొంత దూరంలో ఏర్పాటుపై పరిశీలించాలని సూచిం చారు. 



ఈ వారంలో పరీక్ష కేంద్రాలను గుర్తించి క. పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌కు వివ రాలు పంపించనున్నారు. ప్రతి బెంచిపై ఒక విద్యార్థి కూర్చునేలా చూస్తున్నారు. పదో తరగతి విద్యార్థులు 6.989 లక్షల మంది ఉండగా వీరికి గతంలో 2925 కేంద్రాలను కేటాయించారు. కేంద్రాలు మారితే జంబ్లిం గ్‌తో పాటు హాల్‌టిక్కెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. |


 ప్రళ్శవత్రాల ప్యాకింగ్‌లో ఇబ్బంది పదోతరగతి (ప్రశ్నపత్రాలు జిల్లాలకు చేరాయి. వీటిని ట్రెజరీలు, పోలీస్‌ స్టేషన్లలో భద్రపరిచారు. ప్రశ స్‌త్రా లను పరీక్ష కేంద్రాల సంఖ్య ఆధారంగా ప్రింటింగ్‌(పెస్‌ లోనే ప్యాకింగ్‌ చేయించి నేరుగా పంపిస్తారు. వీటిని పరీక్ష రోజున తెరుస్తారు. పరీక్ష కేంద్రాలు మారిస్తే ప్యాకింగ్‌లను విప్పి సర్దుబాటు చేయాలి. 


ఇది అధికారు లకు కత్తిమీద సాములా మారనుంది. | వనతిగృహాల ఎద్వార్థులకు మరో నమన పైవేటు, ప్రభుత్వ వసతిగృహాల విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయారు. ఇప్పుడు పరీక్షలు పెడితే విద్యార్థులు వచ్చేందుకు రవాణా సౌకర్యాన్ని కల్పించాలి. పాఠశాల ల్లోని వసతి గృహాలను కూడా తెరవాల్సి ఉంటుంది. 
షెడ్యూల్‌పై   : మంత్రి 

పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ పై సామాజిక మాధ్య మాల్లో జరుగుతున్న ప్రచారం అవాస్తమని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. వదంతులను నమ్మొద్దని, పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వం అధికారి కంగా ప్రకటిస్తుందని వెల్లడించారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "పదోతరగతి పరీక్షలకు అదనపు కేంద్రాలు"

Post a Comment