కరోనాపై కేంద్రం తాజా అప్డేట్, లాక్డౌన్పై తాజా మార్గదర్శకాలు ఇవే
న్యూఢిల్లీ: భారత్లో కరోనా ప్రభావానికి సంబంధించి రోజువారీ హెల్త్ బులిటెన్ను కేంద్ర వైద్యఆరోగ్య శాఖ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో భారత్లో 3900 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు.
24 గంటల్లో ఇంత ఎక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం. అంతేకాదు, కరోనా మరణాల సంఖ్య కూడా భారత్లో భారీగా పెరిగింది. 24 గంటల్లో భారత్లో కరోనా బారిన పడి 195 మంది మరణించినట్లు లవ్ అగర్వాల్ ప్రకటించారు. దీంతో.. భారత్లో కరోనా మరణాల సంఖ్య 1,568కి చేరింది.
గడచిన 24 గంటల్లో 1,020 మంది
కరోనా నుంచి కోలుకున్నారని, రికవరీ రేటు 27.41శాతంగా ఉన్నట్లు లవ్ అగర్వాల్
వెల్లడించారు. కొత్తగా నమోదైన కేసులతో కలిపి భారత్లో ప్రస్తుతం కరోనా
పాజిటివ్ కేసుల సంఖ్య 46,433కు చేరింది.
ఇదిలా ఉంటే, కేంద్ర హోం శాఖ లాక్డౌన్ అమలవుతున్న ఈ సందర్భంలో
తాజాగా కొన్ని మార్గదర్శకాలను ప్రకటించింది.
పెళ్లి వేడుకకు 50 మంది మాత్రమే హాజరు కావాలని,
అంత్యక్రియలకు 20 మంది మాత్రమే హాజరు కావాలని
కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య శైల శ్రీవాత్సవ కేంద్రం మార్గదర్శకాలను ప్రకటించారు.
ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తున్న కార్యాలయాల్లో సిబ్బందికి థర్మల్ స్క్రీనింగ్ను తప్పనిసరి చేసినట్లు
ఆమె తెలిపారు. అంతేకాదు, ఫేస్ మాస్క్లను,
శాని టైజర్లనుసిబ్బందికిసరిపడా అందించాల్సిన బాధ్యత ఇంఛార్జ్లదేనని
కేంద్రం స్పష్టం చేసింది.
కార్యాలయాల్లో కూడా భౌతిక దూరాన్ని పాటించాలని, ప్రతి ఒక్క ఉద్యోగి తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్ను వినియోగించాలని కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య శైల శ్రీవాత్సవ స్పష్టం చేశారు
0 Response to "కరోనాపై కేంద్రం తాజా అప్డేట్, లాక్డౌన్పై తాజా మార్గదర్శకాలు ఇవే"
Post a Comment