ఉద్యోగుల పదవీవిరమణ వయోపరిమితి పెంపు

చెన్నై : ఉద్యోగుల పదవీవిరమణ వయోపరిమితి పెరిగింది. గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. తమిళనాడులో ప్రస్తుతం ఉద్యోగుల పదవీవిరమణ వయోపరిమితి ‘58’ సంవత్సరాలుగా ఉండగా... దీనిని ‘59’ సంవత్సరాలకు పెంచారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయి.



కాగా ఈ నెలాఖరుకు పదవీవిరమణ చేయనున్న ఉద్యోగులకు కూడా ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. ప్రభుత్యోద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాల ఉపాధ్యాయులు, 


ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే అన్ని కేడర్ల ఉద్యోగులకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను మాత్రం ప్రభుత్వం వెల్లడించలేదు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఉద్యోగుల పదవీవిరమణ వయోపరిమితి పెంపు"

Post a Comment