విషయం :- ఉపాధ్యాయుల బదిలీలపై వెంటనే చర్యలు తీసుకొమ్మని కోరుట గూర్చి.
రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు 2017 లో జరిగిన విషయం మీకు విధితమే. మూడేళ్ళగా బదిలీలు జరగలేదు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి
ఏడాది కావొస్తోంది. ఉపాధ్యాయుల బదిలీలు జరపమని అనేక సార్లు ఫ్యాప్టో ప్రాతినిధ్యాలు చేసింది. విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు జరపడానికి
వీలు కాదని విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత బదిలీలు జరుపుతామని పలు సందర్భాల్లో తెలిపారు. విద్యా సంవత్సరం ముగిసింది. ఏళ్ళ తరబడి
బదిలీల కోసం ఎదురు చూస్తున్న ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తి, ఆందోళనలో ఉన్నారు. ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్న ప్రభుత్వం
ఉపాధ్యాయ బదిలీలు ఊసు ఎత్తకపోవడం విచిత్రం గా ఉంది.
కోవిడ్ -19 లాక్ డౌన్ పై పలు సడలింపులు ఉన్న నేపథ్యంలో ఉపాధ్యాయ బదిలీలకు స్టేషన్ పాయింట్లు, సర్వీసు పాయింట్లు మాత్రమే పరిగణలోకి
తీసుకొని వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాల్సిందిగా ఫ్యాష్టో తరపున మరో మారు విజ్ఞప్తి చేస్తున్నాము.
0 Response to "ఉపాధ్యాయ బదిలీలు షెడ్యూల్ వెంటనే విడుదల చెయ్యాలి"
Post a Comment