కరోనాపై ఎయిమ్స్ డైరెక్టర్ హెచ్చరిక.. కీలక విషయం వెల్లడి




కరోనాపై ఎయిమ్స్ డైరెక్టర్ హెచ్చరిక

జూన్, జూలై నెలల్లో కరోనా కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా



న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వ్యాప్తికి సంబంధించి ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గుల్జేరియా కీలక హెచ్చరిక చేశారు. జూన్, జూలై నెల్లలో భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు మరింత ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.

 భారత్‌లో కరోనా కేసుల పెరుగుదల రేటు నిలకడగా ఉందని, కొన్ని సందర్భాల్లో ఉన్నట్టుండి కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. అయితే.. భారత్‌లో కరోనా ఎప్పుడు తీవ్రరూపం దాల్చుతుందో కచ్చితంగా చెప్పలేమని కానీ ప్రస్తుతం పెరుగుతున్న కేసుల ఆధారంగా జూన్, జూలైలో కరోనా మరింత ప్రభావం చూపే అవకాశముందని గుల్జేరియా తెలిపారు. భారత్‌లో పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరగడానికి టెస్ట్‌ల సంఖ్య పెరగడమే కారణంగా ఆయన చెప్పుకొచ్చారు. 


రెడ్ జోన్స్, కరోనా హాట్‌‌స్పాట్స్, కంటైన్మెంట్ జోన్లలో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలుచేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కరోనా ప్రభావిత దేశాలైన చైనా, ఇటలీలో కూడా లాక్‌డౌన్, భౌతిక దూరం పాటించడం వల్ల నెల తర్వాత ఫలితాలు కనిపించాయని ఆయన చెప్పారు. భారత్‌లో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 52,952కు చేరింది. మరణాల సంఖ్య 1,783కు చేరింది. భారత్‌లో ప్రస్తుతం ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 35,902.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "కరోనాపై ఎయిమ్స్ డైరెక్టర్ హెచ్చరిక.. కీలక విషయం వెల్లడి"

Post a Comment