ఏపీ: ప్రవేశ పరీక్షలు వాయిదా

✨ ఏపీ: ప్రవేశ పరీక్షలు వాయిదా*

★ ఇంజనీరింగ్‌ తదితర ప్రొఫెషనల్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఎంసెట్‌ సహా ఇతర ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ఉన్నత విద్యామండలి ప్రకటన.

★ లాక్ డౌన్ అమలు నేపథ్యంలో పరీక్షలకు వాయిదా వేసినట్టు వెల్లడి.

*పరీక్షల వాయిదాకు కారణాలివీ..*
★ లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రంలోని ఆన్‌లైన్‌ పరీక్ష కేంద్రాలన్నీ కొంతకాలంగా పూర్తిగా మూతపడ్డాయి. వాటిలో ఎన్ని కంప్యూటర్లు పనిచేస్తాయో తెలీని పరిస్థితి.
★ ముఖ్యంగా పవర్‌ బ్యాక్‌ అప్‌ ఉందో లేదో గుర్తించాలి. ఎన్ని పనిచేస్తున్నాయో పరిశీలించాకే ఆయా కేంద్రాల్లో పరీక్షలకు హాల్‌ టికెట్లు జారీ చేయాల్సి ఉంటుంది.
★ దరఖాస్తు గడువు తొలుత మార్చి 29 వరకు, తర్వాత ఏప్రిల్‌ 5 వరకు లాక్‌డౌన్‌ విధించడంతో  ఏప్రిల్‌ 17 వరకు పొడిగించక తప్పలేదు. 
★ ఇప్పటికీ సుమారు 50 వేల మందికి పైగా విద్యార్థులు ఎంసెట్‌కు ఆన్‌లైన్‌ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంది.
★ ఈ దృష్ట్యా సెట్లను నిరవధికంగా వాయిదా వేసి పరిస్థితులను బట్టి మే నెలలో కొత్త షెడ్యూల్స్‌ జారీ చేస్తామని ఏపీ ఉన్నత ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి తెలిపారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఏపీ: ప్రవేశ పరీక్షలు వాయిదా"

Post a Comment