నేడు ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌

దిల్లీ: కరోనా మహమ్మారి విజృంభించిన తరుణంలో తీసుకోవాల్సిన అంశాలపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. 



కొవిడ్‌-19 వ్యాప్తిని అరికట్టడం, వలస కూలీల కదలికలు, తబ్లీగీ జమాత్‌ గత నెలలో నిర్వహించిన మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్న వారిని గుర్తించి క్వారంటైన్‌కు పంపడం తదితర అంశాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు 




బుధవారమిక్కడ అధికారిక వర్గాలు తెలిపాయి. నిత్యావసరాల కొరతా రాకుండా చూడడంపైనా చర్చ జరిగే అవకాశం ఉందని వివరించాయి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "నేడు ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌"

Post a Comment