టెంత్ పబ్లిక్ మె లో


టెంత్ పబ్లిక్ మె లో

: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు మే నెల రెండో వారంలో ప్రారంభమయ్యే అవకాశం  . 



 ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఈ పరీక్షల కొత్త షెడ్యూల్‌ లాక్‌డౌన్‌ ఎత్తి వేసిన తర్వాత ప్రకటించనున్నారు. 




కరోనా వైరస్‌ (కోవిండ్‌-19) వ్యాప్తి వల్ల
 దేశవ్యాప్తంగా ఈ నెల 14 వరకు లాక్‌డౌన్‌ కొనసాగనున్న విషయం తెలిసిందే.



కొత్త షెడ్యూల్‌ ప్రకటించినా కనీసం 15 రోజుల వ్యవధి కావాల్సి ఉంటుందని.. ఆ తరువాతే పరీక్షల తేదీలను నిర్ణయించాల్సి ఉంటుందని ఎస్‌ఎస్‌సీ బోర్డు చెబుతోంది. 
► కరోనా నేపథ్యంలో విద్యార్థులను దూరదూరంగా కూర్చోబెడతామని ఇంతకుముందే బోర్డు ప్రకటించింది. 
► ఈ దూరం పెంచితే పరీక్ష కేంద్రాలు సరిపోవు. ఇంతకుముందు గుర్తించిన పరీక్ష కేంద్రాల ప్రకారం విద్యార్థులకు గూగుల్‌ మ్యాపింగ్‌తో కూడిన హాల్‌ టికెట్లను బోర్డు జారీ చేసింది. 
► జంబ్లింగ్‌ విధానంలో ఎవరెవరికి ఏయే పరీక్ష కేంద్రాలు కేటాయించారో కూడా వాటిలో వివరంగా ఇచ్చారు.
► ఇప్పుడు కొత్తగా మరిన్ని పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తే.. ఎవరెవరికి ఏయే సెంటర్లు కేటాయించారో తెలియజేస్తూ తిరిగి మళ్లీ హాల్‌ టికెట్లు జారీ చేయాల్సి వస్తుంది.
► ఇది సమస్యతో కూడుకున్న పని కావడంతో మొత్తం ప్రక్రియ మొదటికొచ్చి పరీక్షల నిర్వహణ మరింత ఆలస్యం అవుతుంది.
► ఈ దృష్ట్యా ప్రస్తుతం గుర్తించిన పరీక్ష కేంద్రాల్లోనే అదనపు సదుపాయాలు కల్పించాలనే ఆలోచనలో ఉంది. 




SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "టెంత్ పబ్లిక్ మె లో"

Post a Comment