వ్యక్తుల మధ్య దూరంపై విద్యార్థులు అవగాహన కల్పించాలి




 వ్యక్తుల మధ్య దూరంపై


 విద్యార్థులు అవగాహన కల్పించాలి


 గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌

ఈనాడు, అమరావతి: కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం విద్యార్థులు వ్యక్తిగత ఎడమ పాటిస్తూ, కుటుంబ సభ్యులకు చుట్టుపక్కల వారికి అవగా హన కల్పించాలని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ సూచించారు.


ఈ విష యంలో బైతన్యం తీసుకొచ్చే సత్తా విద్యార్థులకు ఉందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు విశ్వవిద్యాలయాల ఉపకులపతులు వారి పరిధిలోని విద్యార్థులకు ఇ-మెయిల్‌ ద్వారా పిలుపునివ్వాలని నిర్దశించారు. శనివారం రాజ్‌భవన్‌లో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య హేమచంద్రారెడ్డి, ఇతర అధికారులతో గవర్నర్‌ సమీక్ష నిర్వహించారు.




 విశ్వవిద్యాలయాల్లో పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు విశ్వవిద్యాలయాల్లోని మౌలిక వసతులను వినియోగించుకోవాలని గవర్నర్‌ సూచించారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "వ్యక్తుల మధ్య దూరంపై విద్యార్థులు అవగాహన కల్పించాలి"

Post a Comment