ఉద్యోగులు సెలవులడిగితే ఇచ్చేయండి: కేంద్రం
అమరావతి, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో కేంద్రం తాజాగా మరిన్ని ఆదేశాలు జారీ చేసింది.
కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఏ ప్రభుత్వ కార్యాలయంలోకి సందర్శకులను అనుమతించవద్దని, ఈ ఆదేశాలు విధిగా పాటించాలని చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటుంటే సెలవు ఇవ్వాలని తెలిపింది.
ఉన్నతాధికారులు సమావేశాలు నిర్వహించవద్దని, సమీక్షలు నిర్వహించాల్సి వస్తే వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే చేయాలని చెప్పింది
0 Response to "ఉద్యోగులు సెలవులడిగితే ఇచ్చేయండి: కేంద్రం"
Post a Comment