కరోనా పై సీఎం జగన్‌ అత్యున్నత స్థాయి సమీక్ష

*🌺కరోనా పై సీఎం జగన్‌ అత్యున్నత స్థాయి సమీక్ష’*

🌺 రాష్ట్రంలో కరోనా వైరస్‌ నివారణ చర్యలపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు.

🌺 రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు సంబంధించి తీసుకుంటున్న చర్యలపై సీఎం జగన్‌ అధికారులతో చర్చించారు.

*🌺 సమీక్ష లో ఏపీ సీఎం తీసుకున్న నిర్ణయాలు*
🌺 రైతు బజార్ల వికేంద్రీకరణకు సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలు. 
🌺 ప్రజలంతా సామాజిక దూరం పాటించాలని కోరారు. 
🌺 నిత్యావసర వస్తువులు ఎక్కువ ధరలకు అమ్మితే కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. 
🌺 ఎవరైనా ఎక్కువ ధరలకు అమ్మితే 1902 టోల్‌ ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.



🌺 నిత్యావసర వస్తువులు, రైతు బజార్లను ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తెరిచి ఉంచాలని సీఎం ఆదేశం.
🌺 ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రైతు బజార్లను వికేంద్రీకరణ చేయాలని సీఎం జగన్‌ సూచన.
🌺 నిత్యావసర వస్తువుల కోసం రెండు, మూడు సార్లు బయటకు రావొద్దని కోరారు. 
🌺 ఒక వాహనంపై ఒక్కరే ప్రయాణించాలన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "కరోనా పై సీఎం జగన్‌ అత్యున్నత స్థాయి సమీక్ష"

Post a Comment