ప్రభుత్వ ప్రాధమికోన్నత పాఠశాలల్లో శానిటరీ నాప్కిన్స్ వెండింగ్ మిషన్లను అందుబాటులోకి
మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వారి కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రాధమికోన్నత పాఠశాలల్లో శానిటరీ నాప్కిన్స్ వెండింగ్ మిషన్లను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. ఈ పథకాన్ని లాంచ్ చేసే ముందు పైలట్ ప్రాజెక్ట్గా మొదట కొన్ని గవర్నమెంట్ స్కూళ్లలో ఏర్పాటు చేయనుండగా.. ఆ తర్వాత దశల వారీగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్కూళ్ల అన్నింటిలోనూ వీటిని ఏర్పాటు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. హిందూస్తాన్ లివర్ కంపెనీ సహకారంతో జగన్ సర్కార్ ఈ వెండింగ్ మిషన్లను ఏర్పాటు చేయనుండగా.. కేంద్రం చేపట్టిన ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తోంది
ఇక ఈ వెండింగ్ మిషన్లలో రూపాయి వేస్తే.. శానిటరీ నాప్కిన్ వచ్చేలా ఏర్పాటు చేయనున్నారు. ఇదిలా ఉంటే కేంద్రం ఏర్పాటు చేసిన జనఔషధి దుకాణాల్లో ఈ నాప్కిన్స్ ధర 4 రూపాయలు కాగా.. ఏపీ సర్కార్ దీనిని రూపాయికే స్కూల్ విద్యార్థినులకు అందజేయాలని నిర్ణయించింది. త్వరలోనే ప్రారంభం కానున్న విద్యాసంవత్సరం నుంచి ఏపీలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఈ వెండింగ్ మిషన్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు
ఈ క్రమంలోనే మంత్రి ఆదిమూలపు సురేష్ ఇప్పటికే కేంద్రంతో చర్చలు జరిపారని తెలుస్తోంది.
ఇక ఈ వెండింగ్ మిషన్లలో రూపాయి వేస్తే.. శానిటరీ నాప్కిన్ వచ్చేలా ఏర్పాటు చేయనున్నారు. ఇదిలా ఉంటే కేంద్రం ఏర్పాటు చేసిన జనఔషధి దుకాణాల్లో ఈ నాప్కిన్స్ ధర 4 రూపాయలు కాగా.. ఏపీ సర్కార్ దీనిని రూపాయికే స్కూల్ విద్యార్థినులకు అందజేయాలని నిర్ణయించింది. త్వరలోనే ప్రారంభం కానున్న విద్యాసంవత్సరం నుంచి ఏపీలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఈ వెండింగ్ మిషన్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు
0 Response to " ప్రభుత్వ ప్రాధమికోన్నత పాఠశాలల్లో శానిటరీ నాప్కిన్స్ వెండింగ్ మిషన్లను అందుబాటులోకి"
Post a Comment