ఏపీలో 40కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు
సాక్షి, విజయవాడ: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 40కి
చేరాయి. 12 గంటల్లో 17 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్
వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
ప్రకాశంలో అత్యధికంగా 11 కేసులు నమోదవ్వగా, చీరాల పట్టణంలో కొత్తగా 5
కేసులు నమోదయ్యాయి. సోమవారం రాత్రి 164 మందికి కరోనా పరీక్షలు చేయగా, 17
మందికి కరోనా పాజిటివ్గా తేలింది. 147 మందికి నెగిటివ్ వచ్చింది.
గుంటూరు
- 9, విశాఖ - 6, కృష్ణా - 5, తూ.గో - 4, అనంతపురం - 2, చిత్తూరు, కర్నూలు,
నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరికి చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
.
0 Response to "ఏపీలో 40కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు"
Post a Comment