ఈ నెల 31వరకు విద్యాసంస్థలు బంద్

ఈ నెల 31వరకు విద్యాసంస్థలు 
బంద్

సాక్షి, తాడేపల్లి : రాష్ట్రంలో కరోనా వైరస్‌ నియంత్రణపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కరోనా వ్యాప్తిని నివారించేలా పటిష్ట చర్యలు చేపట్టాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో ప్రజలను ఆందోళనకు గురిచేయవద్దని సూచించారు. సీఎం వైఎస్‌ జగన్‌తో భేటీ అనంతరం.. విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. గురువారం నుంచి ఏపీలో స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, కోచింగ్‌ సెంటర్లకు సెలవులు ప్రకటించారు.

ఇందుకు సంబంధించి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. గురువారం నుంచి రాష్ట్రంలోని విద్యా సంస్థలకు సెలవులు ఇస్తున్నట్టు తెలిపారు. పదవ తరగతి పరీక్షలు మాత్రం యథాతథంగా జరుగుతాయని అన్నారు. హాస్టల్‌లో ఉన్న విద్యార్థులను దగ్గరుండి ఇళ్లకు పంపిస్తామని చెప్పారు. ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బస్సులలో వారిని ఇంటికి చేర్చేలా ఏర్పాట్లు చేస్తామన్నారు



కరోనా వైరస్‌ ప్రభావంతో ఏపిలోని విద్యాసంస్థలకు
ఈ నెల ౩1వరకు సెలవు ప్రకటించడం ఖాయంగా
కనిపిసోంది. ప్రస్తుతం దినిపై అధికారులు చర్చలు
జరుపుతుండగా.. ప్రాథమిక పాఠశాలల నుంచి
యూనివర్సిటీలు, వేసవి శిక్షణ శిబిరాలు, శిక్షణ
కేంద్రాలను కూడా మూసివేసేలా ఆదేశాలు


ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే ఇంటర్‌, ౩1వ తేదీ నుంచి జరగాల్సిన టెన్స్‌ పరిక్షలు యథాతథంగా జరుగుతాయని అధికారులు చెబుతున్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Related Posts :

0 Response to "ఈ నెల 31వరకు విద్యాసంస్థలు బంద్"

Post a Comment