ప్రత్యేక హోదా కుదరదు

* మరోసారి తేల్చిచెప్పిన మోడీ సర్కారు 
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర బిజెపి ప్రభుత్వం మరోసారి తేల్చిచెప్పింది. సోమవారం నాడు లోక్‌సభలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. విజయవాడ ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు రాతపూర్వకంగా ఇచ్చిన 


సమాధానంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ 14వ ఆర్థికసంఘం సిఫార్సుల కారణంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యపడదని, అది ముగిసిన అధ్యాయమని మరోసారి పాత పాటే పాడారు. '2015-16 నుండి 2019-20 మధ్య కాలంలో కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టులలో కేంద్రం వాటా 90, రాష్ట్ర వాటా 10 నిష్పత్తిలో ఉంటే, ఆంధ్రప్రదేశ్‌కు ఎంత అదనంగా వచ్చి ఉండేదో అంత మొత్తాన్ని ప్రత్యేక సహాయంగా అందించాలని నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు 1.12.2015న చేసిన సిఫార్సును, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు చేసిన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని చెల్లించేందుకు కేంద్రం అంగీకరించిందని తెలిపారు. ఈ ప్రత్యేక సహాయం కూడా రాష్ట్రానికి నేరుగా అందదని మంత్రి జవా బులో పేర్కొన్నారు

'ఆ కాలంలో (2015-16 నుండి 2019-20) విదేశీ ఆర్థిక సంస్థల నుండి తీసుకున్న రుణాలు, వడ్డీల చెల్లింపు. అసలు వాయిదాలను కేంద్రం చెల్లిస్తుందని తెలిపారు. ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే నీతి ఆయోగ్‌ సిఫార్సుల మేరకు ఇవ్వాల్సిన అదనపు నిధులు కూడా ఇప్పటికే కేంద్రం ఇచ్చివేసినట్లు అవుతుంది. 2020వ సంవత్సరం కూడా ముగియడంతో ఇక కేంద్రం నుండి అదనంగా రాష్ట్రానికి నిధులు వచ్చే అవకాశం కూడా లేదు.

15వ ఫైనాన్స్‌ కమిషన్‌ ఇచ్చిన సిఫార్సుల్లోనూ రాష్ట్రానికి సానుకూలంగా పేర్కొన్న అంశాలు లేవు. తాజాగా ఆర్థికశాఖమంత్రి నిర్మలా సీతారామన్‌ 2020-21 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్‌లో అదనపు నిధులు కేటాయించకపోవడానికి ఇవి కూడా కారణాలని చెబుతున్నారు. మరి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించి తీరుతామని, పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం నిధులు తీసుకొస్తామనిల

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ప్రత్యేక హోదా కుదరదు"

Post a Comment