వాట్సాప్‌కు ఎన్‌పీసీఐ అనుమతి

వాట్సాప్‌కు ఎన్‌పీసీఐ అనుమతి

దిల్లీ: వాట్సాప్‌ డిజిటల్‌ చెల్లింపు వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించి భారీ ముందడుగు పడింది. వాట్సప్‌ పేకు కీలకమైన రెగ్యూలేటరీ అనుమతులు గురువారం వచ్చాయి. '' ది నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ)నుంచి విడతలవారీగా డిజిటల్‌ పేమెంట్స్‌ సేవలు నిర్వహించేందుకు వాట్సాప్‌కు లైసెన్స్‌లు వచ్చాయి'' అని ఆర్‌బీఐ అధికారులు వెల్లడించినట్లు బిజినెస్‌ స్టాండర్డ్‌ వెల్లడించింది.

ఆర్‌బీఐ నుంచి వాట్సాప్‌కు గ్రీన్‌సిగ్నల్‌ వచ్చిన కొన్ని రోజుల్లోనే ఎన్‌పీసీఐ అనుమతులు రావడం గమనార్హం.




డేటా స్థానికీకరణ నిబంధనలకు అనుకూలంగానే పనిచేస్తామని వాట్సాప్‌ వెల్లడించడంతో అనుమతులు లభించాయి. గతంలో ఈ కారణంతోనే అనుమతులు ఆలస్యమైనట్లు సమాచారం.

వాట్సాప్‌ తొలిదశలో భారత్‌లోని కోటి మందికి డిజిటల్‌ చెల్లింపు సేవలను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. వాట్సాప్‌ నిబంధనలను పూర్తిస్థాయిలో అమలు చేయగానే మిగిలిన వారికి కూడా ఈసేవలు అందుబాటులోకి వస్తాయి. వాట్సాప్‌ ఈ సేవలను పూర్తిగా అందుబాటులోకి తెస్తే దేశంలోనే అతిపెద్ద డిజిటల్‌ సేవల చెల్లింపు సంస్థగా మారుతుంది. ప్రస్తుతం వాట్సాప్‌కు దాదాపు 40 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు.

2018 ఫిబ్రవరిలోనే ప్రయోగాత్మకంగా..

వాస్తవానికి వాట్సాప్‌ చెల్లింపు సేవలను ఫిబ్రవరి 2018లోనే ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. దీనికి ఐసీఐసీఐ బ్యాంక్‌ భాగస్వామిగా ఉంది. ఈ సర్వీసులు యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేజ్‌లో నిర్వహిస్తారు. దీనిని ఎన్‌పీసీఐ అభివృద్ధి చేసింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "వాట్సాప్‌కు ఎన్‌పీసీఐ అనుమతి"

Post a Comment