ఆదాయ పన్ను శ్లాబుల్లో భారీ మార్పులు
ఆదాయ పన్ను శ్లాబుల్లో భారీ మార్పులు
దిల్లీ: గిఫ్ట్ సిటీలో నూతనంగా బులియన్ ఎక్స్ఛేంజీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎల్ఐసీలో పెట్టుబడుల ఉపసంహరణకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఆదాయ పన్ను శ్లాబుల్లో భారీ మార్పులు చేపట్టిన్నట్లు ప్రకటించారు. మధ్య, ఎగువ మధ్య తరగతికి ఊరటనిచ్చేలా చర్యల తీసుకున్నామని చెప్పారు. ఆదాయ పన్ను శ్లాబులను 4 నుంచి ఏడుకు పెంచామన్నారు. రూ.2.50లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి ఎలాంటి పన్ను ఉండదని స్పష్టం చేశారు. కొత్త ఆదాయ పన్ను విధానం ఐచ్ఛికం అని తెలిపారు. మినహాయింపులు పొందాలా? వద్దా? అన్నది వేతన జీవుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
ఆదాయ పన్ను శ్లాబులు ఇలా...
* 0 నుంచి 2.5లక్షల వరకు ఎలాంటి పన్నులేదు
* 2.50లక్షల నుంచి రూ.5లక్షల వరకు - 5 శాతం
* రూ.5లక్షల నుంచి రూ.7.50 లక్షల వరకు -10 శాతం
* 7.50లక్షల నుంచి 10లక్షల వరకు - 15 శాతం
* రూ.10లక్షల నుంచి రూ.12.50 లక్షల వరకు -20 శాతం
* రూ.12.50లక్షల నుంచి రూ.15లక్షల వరకు -25 శాతం
* రూ.15లక్షల పైన -30 శాతం
publish-time 01/02/2020 | 13:20 IST
0 Response to "ఆదాయ పన్ను శ్లాబుల్లో భారీ మార్పులు"
Post a Comment