టీచర్లకు సంక్రాంతి లేదా..!

  • పండుగరోజే ‘నాడు-నేడు’
  • మేం పండుగ జరుపుకోవద్దా...
  • ఉపాధ్యాయుల్లో అసంతృప్తి
అమరావతి, జనవరి 11(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగకు ఉపాధ్యాయులు దూరం కానున్నారు. పాఠశాలల్లో ‘నాడు-నేడు’ కార్యక్రమానికి ఈ నెల 15న శ్రీకారం చుట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇందులో టీచర్లకు పలు బాధ్యతలు అప్పగించింది. రాష్ట్రంలో పెద్దపండుగ అయిన సంక్రాంతికి పాఠశాల విద్యాశాఖ ఈ నెల 10 నుంచి 20 వరకూ పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. విద్యా సంవత్సరం ఆరంభంలోనే అకడమిక్‌ కేలండర్‌లోనూ దీన్ని పొందుపరిచింది. పండుగ సెలవుల్లో ముందే ప్లాన్‌ చేసుకొని మరీ టీచర్లు సొంతూళ్లకు వెళ్తారు. అక్కడే పండుగను చేసుకుంటారు. 15న అందరికీ పర్వదినమే. కానీ ఈసారి మాత్రం ఉపాధ్యాయులకు దీన్ని జరుపుకొనే అవకాశం లేదు. ‘నాడు-నేడు’ అమలు చేయనున్న పాఠశాలల్లో సంక్రాంతి రోజే ప్రోగ్రామ్‌ చేయాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు

ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉన్నత పాఠశాలల్లో క్రాఫ్ట్స్‌, డ్రాయింగ్‌, వ్యాయామ ఉపాధ్యాయులు, ఇంజనీర్లు హాజరు కావాల్సి ఉంటుంది. సంక్రాంతి సెలవులు 11రోజులున్నప్పటికీ పండుగ నాడే ఈ కార్యక్రమం నిర్వహించడం పట్ల టీచర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరుతున్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " టీచర్లకు సంక్రాంతి లేదా..!"

Post a Comment