రాజధానిపై 20న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం!
అమరావతి: ఏపీ శాసనసభ ప్రత్యేక సమావేశం ఈనెల 20న నిర్వహించనున్నారని సమాచారం. ఈ సమావేశంలోనే రాష్ట్ర రాజధానిపై జీఎన్ రావు కమిటీ నివేదిక, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదికలతో పాటు వీటిని అధ్యయనం చేసి ఉన్నతస్థాయి కమిటీ ఇచ్చే నివేదికపైనా
చర్చించనున్నారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికా చర్చకు రావచ్చు. 18న రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. అప్పటికి ఉన్నతస్థాయి కమిటీ తన నివేదికను సమర్పిస్తుందని, దానిపై సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిసింది
0 Response to "రాజధానిపై 20న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం!"
Post a Comment