జగనన్న గోరుముద్ద'గా మధ్యాహ్న భోజనం!
కొత్త మెనూ అమలు చేస్తున్నాం..
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అమలు చేసే మధ్యాహ్న భోజన పథకంలోనూ సమూల మార్పులు తీసుకొస్తున్నామని సీఎం వివరించారు. రోజూ ఒకే రకంగా కాకుండా నాణ్యమైన భోజనం పెట్టేందుకు మెనూలో మార్పులు చేశామన్నారు. ఈ పథకానికి 'జగనన్న గోరుముద్ద'గా నామకరణం చేసినట్లు జగన్ ప్రకటించారు. కొత్త మెనూను ఈరోజు నుంచే అమలు చేస్తున్నామని వివరించారు. మధ్యాహ్నం భోజన పథకం ఆయాలకు ఇచ్చే గౌరవ వేతనాన్ని కూడా రూ.వెయ్యి నుంచి రూ.3వేలకు పెంచామన్నారు. దీంతో ప్రభుత్వానికి రూ.344 కోట్ల అదనపు భారం పడుతోందని చెప్పారు.
పర్యవేక్షణకు నాలుగంచెల వ్యవస్థ
మధ్యాహ్న భోజనంలో నాణ్యతను పెంచేందుకు నాలుగంచెల వ్యవస్థను తీసుకొస్తున్నామని జగన్ తెలిపారు. పాఠశాల అభివృద్ధి కమిటీ నుంచి ముగ్గురికి పర్యవేక్షణ బాధ్యత అప్పగిస్తామన్నారు. వారితో పాటు వార్డు, గ్రామ సచివాలయంలో ఉండే విద్య, సంక్షేమ అధికారి నాణ్యతను పరిశీలించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రోజువారీ నివేదికను అందజేసేలా చర్యలు చేపడతామన్నారు. వీరందరిపై ఆర్డీవో స్థాయి అధికారి పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఇంగ్లిష్ మీడియం చదువులతో విద్యార్థుల జీవితాలు బాగుపడతాయని.. ప్రపంచంతో పోటీ పడే పరిస్థితి మెరుగవుతుందన్నారు. దీనిపై ఇప్పటికే ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నామని సీఎం వివరించారు
0 Response to "జగనన్న గోరుముద్ద'గా మధ్యాహ్న భోజనం!"
Post a Comment