బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్ హైలైట్స్
- 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు
- 6.1 కోట్ల మంది రైతులకు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన
- వ్యవసాయంలో పోటీ తత్వం పెంచడమే లక్ష్యం
- వ్యవసాయంలో పెట్టుబడి లాభదాయకం కావాలి
- వ్యవసాయరంగ అభివృద్ధికి 16 సూత్రాల కార్యాచరణ
- కేంద్ర చట్టాలు అమలు చేసే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు
- అంత్యోదయ స్కీమ్కు అత్యంత ప్రాధాన్యత
- నీటి లభ్యత తక్కువగా ఉన్న 100 జిల్లాలకు ప్రయోజనం కలిగించే పథకాలు
- సౌరశక్తి ద్వారా పంపుసెట్ల నిర్వహణకు ప్రోత్సాహకం
- కొత్తగా 15లక్షల మంది రైతులకు సోలార్ పంపులు
- రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి.. సేంద్రీయ ఎరువుల వినియోగం పెంచేందుకు చర్యలు
- సేంద్రీయ ఉత్పత్తుల విక్రయానికి ఆన్లైన్ పోర్టల్
- దేశంలో 160 మిలియన్ మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం
- గ్రామాల్లో ధాన్యలక్ష్మి పథకం
- స్వయ సహాయక బృందాలతో గ్రామాల్లో గిడ్డంగి సదుపాయం
- ధాన్యలక్ష్మి పథకానికి ముద్ర, నాబార్డ్ సాయం
- పాలు, చేపల రవాణాకు కిసాన్ రైలును ప్రారంభించనున్న భారతీయ రైల్వే
- పీపీపీ భాగస్వామ్యంతో కిసాన్ రైలు
- కృషి ఉడాన్ పేరుతో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతికి విమానాలు
- ఉద్యానవన ఉత్పత్తులు 311 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరాయి
- 2020-21లో అగ్రికల్చర్ రీఫైనాన్స్ లక్ష్యం రూ.15 లక్షల కోట్లు
- ఇప్పటికి 58లక్షల స్వయం సహాయక బృందాలు పనిచేస్తున్నాయి
- స్వయం సహాయక బృందాలను మరింత విస్తరిస్తాం
- వ్యవసాయ రంగానికి రూ.2.83 లక్షల కోట్లు కేటాయింపు
- వ్యవసాయానికి మాత్రం 1.60 లక్షల కోట్లు
- గ్రామీణాభివృద్ధికి 1.23 లక్షల కోట్లు
- మత్స్యకారులకు సాగర్మిత్ర పథకం
- పీపీపీ పథకం కింద మరిన్ని ఆస్పత్రుల ఏర్పాటు
- ఆయుష్మాన్ భారత్ కింద 112 జిల్లాల్లోని ద్వితీయశ్రేణి పట్టణాలకు ప్రాధాన్యం
- 2025 నాటికి టీబీని రూపుమాపడమే సర్కార్ ధ్యేయం
- బహిరంగ మల విసర్జన రహిత భారత్ సాధన కోసం ఓడీఎస్ ప్లస్ పథకం
- స్వచ్ఛ భారత్కు రూ.12,300 కోట్లు
- 2030 నాటికి ప్రపంచంలో ఎక్కువ మంది ఉద్యోగార్హులు
- త్వరలో కొత్త విద్యా విధానం
- మార్చి నాటికి 150 విద్యాసంస్థల్లో వృత్తి విద్యాకోర్సులు
- ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఇంటర్న్షిప్
- వైద్య రంగానికి రూ.69 వేల కోట్లు
- పేద విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఆన్లైన్ విద్య
- త్వరలో నేషనల్ పోలీస్, ఫోరెన్సిక్ సైన్స్ విశ్వవిద్యాలయాల ఏర్పాటు
- వైద్య కళాశాల, జిల్లా కేంద్ర ఆస్పత్రుల్లో పీపీపీ విధానం అనుసంధానం
- జల్జీవన్ మిషన్కు 11,500 కోట్లు
- ప్రధాని జన ఆరోగ్య యోజన పథకానికి రూ.6400 కోట్లు
- ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ సెల్ ఏర్పాటు చేయనున్న కేంద్రం
- స్కిల్ డెవలప్మెంట్కు రూ.3 వేల కోట్లు
- కొత్తగా ఐదు స్మార్ట్ సిటీలు
- రూ.1480 కోట్లతో నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్
- ఎలక్ట్రానిక్ రంగంలో తయారీని ప్రోత్సహించేందుకు ప్రత్యేక విధానాలు
- ఎగుమతులను ప్రోత్సహించేందుకు నిర్విక్ స్కీమ్
- ప్రతి జిల్లాను ఎక్స్పోర్ట్ హబ్గా తయారు చేస్తాం: నిర్మల
- మౌలిక సదుపాయాల కల్పన కోసం వచ్చే ఐదేళ్లలో రూ.100 లక్షల కోట్లు
- పారిశ్రామిక, వాణిజ్యరంగాల కోసం రూ.27,300 కోట్లు
- త్వరలో నేషనల్ లాజిస్టిక్ పాలసీ: నిర్మల
- పర్యాటక ప్రాంతాలను కలుపుతూ మరిన్ని తేజస్ రైళ్లు: నిర్మల
- త్వరలో జాతీయ లాజిస్టిక్ పాలసీ
- అన్ని రకాల ముడిసరుకులు ఒకే చోట దొరికేలా ప్రత్యేక విధానం
- అంతర్జాతీయ మార్కెట్తో పోలిస్తే దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్న నిర్మల
- ప్రతి ఇంటికి విద్యుత్ అందించడం మా ప్రభుత్వం సాధించిన ఘనత
- రాబోయే మూడేళ్లలో ప్రీపెయిడ్ కరెంట్ స్మార్ట్ మీటర్లు పెట్టాలని.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచిస్తున్నాం
- స్మార్ట్ మీటర్లతో కరెంటు ఎవరి దగ్గరి నుంచి కొనాలో.. నిర్ణయించుకునే వెసులుబాటు వినియోగదారులకు ఉంటుంది
- జాతీయ గ్యాస్ గ్రిడ్ను 16 వేల కి.మీ. స్థాయి నుంచి 27 వేల కి.మీ స్థాయికి విస్తరింపు
- కొత్త అవకాశాలను అందుకునేందుకు డేటా సెంటర్ పార్క్లు ఏర్పాటు
- భారత నెట్ ద్వారా ప్రతి ఇంటికి ఫైబర్ నెట్ కనెక్షన్
- లక్ష పంచాయతీలకు ఇప్పటికే ఫైబర్ నెట్ కనెక్షన్
- మూలకణ వైద్యవిధానం అభివృద్ధి కోసం డేటా బేస్ ఏర్పాటు
- క్వాంటమ్ టెక్నాలజీస్ అప్లికేషన్ కోసం రూ.8 వేల కోట్లు
- బాలిక, మహిళల సంక్షేమం కోసం రూ. 26 వేల కోట్లు
- షెడ్యూల్ కులాలు, వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం రూ. 85 వేల కోట్లు
- షెడ్యూల్ తెగల కోసం రూ.53, 700 కోట్లు
- దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం రూ. 9 వేల కోట్లు
- రాఖీగడి, హస్తినాపూర్, శివసాగర్, డోలాబీరా, ఆదిత్యనల్లూర్ లాంటి.. చారిత్రక ప్రాంతాల్లో మ్యూజియంలు ఏర్పాటు
- విశేష పురావస్తు కేంద్రాలుగా అభివృద్ధి
- రాంచీలో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు
- లోధాల్లో మారిటైమ్ మ్యూజియం ఏర్పాటు
సాక్షి, న్యూఢిల్లీ : 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెడుతున్నారు. నరేంద్రమోదీ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్న రెండో బడ్జెట్ ఇది. ప్రస్తుతం కొనసాగుతున్న కేంద్ర బడ్జెట్ 2020-21 లైవ్ అప్డేట్స్ ఇవి..
2020-21
ఆర్థిక సంవత్సరం కేంద్ర బడ్జెట్ హైలైట్స్..
విద్యారంగంలో ప్రైవేటు పెట్టుబడులు
- విద్యారంగంలో ప్రైవేటు పెట్టుబడులకు అనుమతి
- జల్జీవన్ మిషన్కు రూ 11,500 కోట్లు
- విద్యారంగానికి రూ 99.300 కోట్లు
- నైపుణ్యాభివృద్ధికి రూ 3,000 కోట్లు
- కొత్తగా ఐదు స్మార్ట్ సిటీల అభివృద్ధి
- నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్ ఏర్పాటుకు రూ1480 కోట్లు
- పరిశ్రమలు, వాణిజ్య రంగానికి రూ 27,300 కోట్లు
- చిన్న ఎగుమతిదారుల కోసం నిర్విక్ పథకం
- త్వరలో జాతీయ లాజిస్టిక్స్ పాలసీ
బడ్జెట్లో వ్యవసాయ రంగానికి పెద్దపీట
- రూ 15 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు
- వ్యవసాయ, గ్రామీణాభివృద్ధికి రూ 2.83 లక్షల కోట్లు
- పంచాయితీరాజ్కు రూ 1.23 లక్షల కోట్లు
- ఆరోగ్య రంగానికి రూ 69,000 కోట్లు
- స్వచ్ఛభారత్ మిషన్కు రూ 12,300 కోట్లు
- పైప్డ్ వాటర్ ప్రాజెక్టుకు రూ 3.6 లక్షల కోట్లు
గ్రామీణ మహిళలకు ధాన్యలక్ష్మి
- ముద్ర స్కీమ్ ద్వారా గ్రామీణ మహిళలకు సాయం
- గ్రామీణ మహిళలకు ధాన్యలక్ష్మి పేరుతో నూతన స్కీం
- నాబార్డు ద్వారా రీఫైనాన్స్ పునరుద్ధరిస్తాం
ఆన్లైన్లో ఆర్గానిక్ ఉత్పత్తులు
- 16 లక్షలమంది రైతులకు గ్రిడ్ అనుసంధానిత సోలార్ విద్యుత్
- సేంద్రియ సాగుచేసే రైతులకు మరిన్ని ప్రోత్సహకాలు
- ఈ సారి బడ్జెట్ మూడు రంగాల వృద్ధికి ఊతమివ్వనుంది
- ఒకటి ఆరోగ్యం, రెండోది విద్య, మూడోది ఉద్యోగ కల్పన
- రైతుల సౌకర్యార్థం రిఫ్రిజిలేటర్తో కూడిన కిసాన్ రైలు ఏర్పాటు
- సివిల్ ఏవియేషన్ ద్వారా కూరగాయల సరఫరాకు కృషి ఉదాన్ పథకం
- జీరో బడ్జెట్ నేచురల్ ఫామింగ్కు చేయూత
- ఆన్లైన్లో ఆర్గానిక్ ఉత్పత్తుల విక్రయం
మా ప్రాధాన్యతా అంశాలు ఇవే
- తొలి ప్రాధాన్యం : వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధి
- ద్వితీయ ప్రాధాన్యాంశం : ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీరు
- మూడో ప్రాధాన్యాంశం : విద్య, చిన్నారుల సంక్షేమం
రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం
- 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడం బడ్జెట్ లక్ష్యం
- రైతు సంక్షేమానికి 16 కార్యాచరణ ప్రణాళికలు
- 100 కరువు జిల్లాలకు తాగునీరు అందించే పథకాలు
- 26 లక్షల మంది రైతులకు సోలార్ పంపు సెట్లు
- పేదరికం నుంచి 27 కోట్లమందిని బయటకు తెచ్చాం
- ఇక నుంచి ఇన్కం టాక్స్ రిటర్న్ల ఫైలింగ్ మరింత సులభతరం చేస్తాం
- ఆరు కోట్ల 11 లక్షల మందికి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన
కవితను చదివి వినిపించిన నిర్మల
- నా దేశం దాల్ సరస్సులో విరబూసిన కమలం లాంటిది
- మానవత్వం, దయతో కూడిన సమాజం అవసరం
- నా దేశం సైనికుల నరాల్లో ప్రవహిస్తున్న ఉడుకు రక్తం
- మా దేశం వికసిస్తున్న షాలిమార్ తోటలాంటిది
జీఎస్టీ శ్లాబుల తగ్గింపుతో సామాన్యులకు మేలు
- జీఎస్టీతో పన్ను వ్యవస్థలోకి కొత్తగా 60 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు
- రూ లక్ష కోట్ల వరకూ జీఎస్టీ ప్రయోజనాలు సామాన్యులకు మళ్లింపు
- 40 కోట్ల జీఎస్టీ రిటర్నులు దాఖలయ్యాయి
- జీఎస్టీ సమస్యల పరిష్కారానికి జీఎస్టీ మండలి చొరవ
- జీఎస్టీ శ్లాబుల తగ్గింపుతో సామాన్యులకు మేలు జరిగింది
- జీఎస్టీ అమలు తర్వాత సామాన్యుల ఖర్చులు 4శాతం వరకు ఆదా అయ్యాయి
అదుపులో ద్రవ్యోల్బణం
- ఎకానమీని సంఘటితపరిచేందుకు చర్యలు
- ఆరోగ్యకరమైన వాణిజ్య వృద్ధికి తోడ్పాటు
- ప్రభుత్వం విస్తృత సంస్కరణలు చేపట్టింది
- ద్రవ్యోల్బణం అదుపులో ఉంది
- జీఎస్టీతో సామాన్యులకు నెలకు 4 శాతం వరకూ ఆదా
జీఎస్టీ చరిత్రాత్మకమైనది
- దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులు బలంగా ఉన్నాయి
- ఈ బడ్జెట్ దేశ ప్రజల ఆర్థిక స్థోమతను పెంచుతుంది
- కేంద్రం చేపట్టిన సంస్కరణల్లో జీఎస్టీ చరిత్రాత్మకమైనది
- ఆర్థిక సంస్కరణల్లో జీఎస్టీ కీలకమైనది
అందరికీ ఇళ్లు
- సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు అందడం లేదు
- రూపాయిలో 15పైసలు మాత్రమే లబ్ధిదారులకు చేరుతున్నాయి
- ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా అందరికీ ఇళ్లు మంజూరు చేస్తాం
- భారత్లో ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నాయి
ప్రజల కొనుగోలు శక్తిని పెంచుతాం
- ప్రజల ఆదాయాలను మెరుగుపరచడమే బడ్జెట్ లక్ష్యం
- ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్
- ప్రజల్లో కొనుగోలు శక్తిని ముమ్మరం చేస్తాం
- దివంగత నేత అరుణ్ జైట్లీని గుర్తుచేసిన నిర్మల
- స్టాక్ మార్కెట్లో బడ్జెట్ జోష్
- బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
- లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
- కాసేపట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో పార్లమెంటుకు చేరుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూతురు వాఙ్మయి, ఇతర కుటుంబసభ్యులు
0 Response to "బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్ హైలైట్స్"
Post a Comment