టీచర్ల సెలవుల అధికారం హెచ్‌ఎంలకే

  • స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎంల నుంచి వెనక్కి.. విద్యాశాఖ నిర్ణయం
  • ఉపాధ్యాయ సంఘాల హర్షం

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు సెలవుల మంజూరు అధికారాన్ని తిరిగి ఆ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకే అప్పగించారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ విజయకుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయు లు, హెచ్‌ఎంలకు సెలవుల మంజూరు అధికారాన్ని స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలకు అప్పగిస్తూ పాఠశాల విద్యాశాఖ ఈ నెల 13న 6225 మోమోను జారీ చేసి న విషయం తెలిసిందే


అయితే దీనిని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీనిపై 4 రోజులుగా జరుగుతున్న శిక్షణ తరగతుల్లో భోజన విరామ సమయాల్లో టీచర్లు ఆందోళన చేపడుతున్నారు. దీంతో విద్యాశాఖ తన నిర్ణయాన్ని మార్చుకుంది. మెమో 6225ను సవరిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసిం ది. అయితే ఉపాధ్యాయుల సెలవుకు సంబంధించి సమాచారాన్ని సదరు పాఠశాల హెచ్‌ఎం.. స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎంకు తెలపాల్సి ఉంటుందని పేర్కొం ది. ఈ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు పీఆర్టీ యూ, యూటీఎఫ్‌, పీఆర్టీయూ-తెలంగాణ, ఎస్టీయూ, ఎస్జీటీయూ, టీఎ్‌సపీటీఏ హర్షం వ్యక్తం చేశాయి. విద్యాశాఖ మంత్రి సబిత, కార్యదర్శి జనార్దన్‌రెడ్డికి, కమిషనర్‌ విజయకుమార్‌కు కృతజ్ఞతలు తెలిపాయి


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "టీచర్ల సెలవుల అధికారం హెచ్‌ఎంలకే"

Post a Comment