బ్రేకింగ్: రెండ్రోజుల్లో రాజధాని మార్పుపై కీలక ప్రకటన
అమరావతి: ఆంధ్రప్రదేశ్కు
మూడు రాజధానులు ఉండొచ్చేమోనని అసెంబ్లీ వేదికగా సీఎం వైఎస్ జగన్
మోహన్రెడ్డి సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. జగన్ ప్రకటనను
ప్రతిపక్షాలు, రాజధాని రైతులు వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు టీడీపీ నేతలు,
రైతులు రాజధాని ప్రాంతంలో ఆందోళనలు చేపడుతున్నారు. ఇలా మూడు రాజధానులపై
వ్యతిరేకత వస్తుండటంతో.. ఈ ‘మార్పు’ నిర్ణయంపై రెండు లేదా మూడ్రోజుల్లో
కీలక ప్రకటన వెలువడే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా
కేంద్రాల నుంచి బెటాలియన్ అమరావతికి తరలివస్తోంది.
ప్రకటన
వచ్చిన తర్వాత గొడవలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు చర్యలు
తీసుకుంటున్నారని సమాచారం. అమరావతిలోని అంబటినగర్(యర్రబాలెం) లోని ఓ కళ్యాణ
మండపంలో సుమారు 300మందికి పైగా పోలీసులకు యంత్రాంగం వసతి ఏర్పాటు
చేసినట్లు సమాచారం. అయితే ప్రభుత్వం నుంచి రాజధాని మార్పుపై ఎలాంటి ప్రకటన
వెలువడుతుందా..? అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు
0 Response to "బ్రేకింగ్: రెండ్రోజుల్లో రాజధాని మార్పుపై కీలక ప్రకటన"
Post a Comment