దేశమంతటా బ్రాడ్బ్యాండ్
2022 కల్లా అన్ని గ్రామాలకు అందుబాటులోకి..
జాతీయ స్థాయి మిషన్ను ప్రారంభించిన కేంద్రం
ఈనాడు, దిల్లీ: దేశవ్యాప్తంగా ప్రతి గ్రామానికి 2022 కల్లా నాణ్యమైన బ్రాడ్ బ్యాండ్ సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఇందుకోసం కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ దిల్లీలో మంగళవారం 'జాతీయ బ్రాడ్ బ్యాండ్ మిషన్'ను ప్రారంభించారు. మనదేశంలో డిజిటల్ వ్యవస్థను మరింత వృద్ధి చేసేందుకు వీలుగా సమాచార వ్యవస్థ మౌలిక వసతులను త్వరితగతిన అభివృద్ధి చేయడం దీని లక్ష్యాల్లో ఒకటి. భారత్ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా చూడాలన్న ప్రధాని నరేంద్ర మోదీ కల సాకారమయ్యేందుకు ఈ మిషన్ సాధనంగా ఉపయోగపడుతుందని రవిశంకర్ అభిప్రాయపడ్డారు
మిషన్ లక్ష్యాల్లో మరికొన్ని..
* దేశవ్యాప్తంగా 30 లక్షల కిలోమీటర్ల పొడవున ఆప్టికల్ ఫైబర్ కేబుళ్ల ఏర్పాటు.
* ప్రస్తుతం ప్రతి వెయ్యిమంది జనాభాకు 0.42గా ఉన్న టవర్ల సాంద్రతను 2024 కల్లా ఒకటికి పెంచడం.
* మొబైల్, అంతర్జాల సేవల నాణ్యతను గుణాత్మకంగా మెరుగుపరచడం.
* దేశవ్యాప్తంగా ఆప్టికల్ ఫైబర్, టవర్ నెట్వర్క్ను గుర్తిస్తూ డిజిటల్ ఫైబర్ మ్యాప్ను రూపొందించడం.
* భాగస్వామ్య సంస్థల ద్వారా రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టడం
0 Response to "దేశమంతటా బ్రాడ్బ్యాండ్"
Post a Comment