దేశమంతా ఒకే సిలబస్.. కేంద్రమంత్రి సంచలన ప్రకటన..?
దేశమంతటా ఒకే సిలబస్ అమలు చేయాలన్న డిమాండ్ ను కేంద్రం తోసిపుచ్చింది . ఇది సాధ్యం కాదని తేల్చి చెప్పింది . ఈ విషయాన్ని కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ పార్లమెంటులో స్పష్టం చేశారు . రాజ్యంగంలో విద్య ఉమ్మడి జాబితాలో ఉందని పాఠ్యప్రణాళికలో రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా నిర్ణయం తీసుకోవచ్చునని కేంద్రమంత్రి స్పష్టం చేశారు .
అయితే పాఠ్యంశాల రూపకల్పనలో మార్గనిర్దేశం చేయడానికి జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్ వర్క్ ను ఎన్సీఈఆర్టీ ఏర్పాటు చేసినట్టు ఆయన ప్రకటించారు . రాష్ట్రాల విద్యా పరిశోధన , శిక్షణా మండలి వీలైతే ఎన్సీఈఆర్టీ విధానాన్ని అనుసరించవచ్చునని సూచించారు . అంది ఇష్టం లేకపోతే . జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్ వర్క్ ఆధారంగా సొంత పాఠ్యాంశాలను రూపొందించుకోవచ్చని తెలిపారు .
అంతరించిపోతున్న భాషలను సంరక్షించడానికి కేంద్ర , రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో ఒక పథకం ప్రవేశపెట్టినట్లు పోఖ్రియాల్ తెలిపారు . అందుకోసం విశ్వవిద్యాలయాలను స్థానిక భాషల ఆధారంగా పలు గ్రూపులుగా విభజించినట్లు వివరించారు . దీని ప్రకారం రాష్ట్రాలు సొంతంగా పాఠాలు రూపొందించుకోవచ్చు
0 Response to "దేశమంతా ఒకే సిలబస్.. కేంద్రమంత్రి సంచలన ప్రకటన..?"
Post a Comment