ఏపీలో ఆర్టీసీ కార్మికులకు సంక్రాంతి అడ్వాన్స్
ఆర్టీసీ ఈయు జోనల్ కమిటీ హర్షం
కడప (మారుతీనగర్):
ఆర్టీసీ కార్మికులకు వచ్చే సంక్రాంతి పండుగకు జనవరి 1న జీతంతో పాటు పండుగ
అడ్వాన్స్ చెల్లించే విధంగా ఆర్టీసీ ఎండీ క్రిష్ణబాబు ఆదేశాలివ్వడం
హర్షనీయమని ఆర్టీసీ ఈయూ జోనల్ అధ్యక్షుడు కేకే కుమా ర్, కార్యదర్శి
ఎన్.రాజశేఖర్ అన్నారు. గురువారం స్థానిక బస్టాండు వద్ద గల యూనియన్
కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆర్టీసీలో పనిచేస్తున్న
కార్మికుల్లో క్లాస్ 3 కేటగిరిలో పనిచేసే ఉద్యోగులకు 4500, క్లాస్ 4
విభాగం వారికి 4వేల చొప్పున పండుగ అడ్వాన్సుగా జీతంతో పాటు
ఇవ్వనున్నారన్నారు. పండుగ అడ్వాన్సు ఇప్పించిన రాష్ట్ర కమిటీకి వారు
అభినందనలు తెలిపారు
0 Response to " ఏపీలో ఆర్టీసీ కార్మికులకు సంక్రాంతి అడ్వాన్స్"
Post a Comment