ఆంగ్ల భాష నైపుణ్యం తప్పనిసరి; మంత్రి సురేష్
ఈనాడు డిజిటల్, అమరావతి, కడప: ఆంగ్లం సార్వత్రిక భాష అని,
ఆ భాషా నైపుణ్యాలను విద్యార్థుల్లో పెంచడం చారిత్రక అవసరమని విద్యా
శాఖ మంత్రి ఆదిమూలపు సురెష్ పేర్కొన్నారు. రాష్ట్ర విద్యార్థులు ప్రపంచ
స్థాయి ప్రమాణాలను సాధించాలంటే ఆంగ్ల భాష నైపుణ్యం తప్పనిసరని వివ
రించారు. గురువారం కడపలో విలేకరులతో మాట్లాడటంతో పాటు అమరా
వతిలో ప్రకటన విడుదల చేశారు. 'వివిధ బోధనా మాధ్యమాలు రాష్ట్రంలో
అమలవుతున్నాయి. వీటికి అనుగుణంగా విద్యార్థుల నైపుణ్యాలు పెంచడం
సవాలుగా మారింది. కొన్ని బోధనా మాధ్యమాలపై వివక్ష మొదలైంది. ఇది
విద్యార్థుల ఆత్మ స్టైర్యాన్ని దెబ్బతీసి వారిని సామాజిక వర్గాలుగా విభజించే
ప్రమాదం ఉంది. అక్టోబరు నెలాఖరులో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల
నమోదును పరిశీలిస్తే 0.00 లక్షల విద్యార్దుల్లో 14.2 లక్షల (2.86%)
చిన్నారులు ఆంగ్ల మాధ్యమంలోనే చదువుతున్నారు. 49.61% ఎస్సీలు, 88.
జి%్ ఎస్టీలు ఈ మాధ్యమంలో అభ్యసిస్తున్నారు. కొన్నేళ్లుగా ప్రభుత్వ
యాజమాన్య పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని సమాంతరంగా బోధిస్తున్నప్ప
టికీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫలితాలు అందడం లేదు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధన లేక చాలామంది (పైవేటు బడుల్లో చేర
డానికి ఆసక్తి చూపుతున్నారు. 2006లో వైఎస్ హయాంలోనే రాష్ట్రంలో
సక్సెస్ పాఠశాలల పేరుతో ఆంగ్ల బోధన ప్రవేశపెట్టారు. మాతృభాషకు
కూడా సముచిత ప్రాధాన్యమిస్తున్నాం. గత తెదేపా ప్రభుత్వం రాష్ట్రంలో
తెలుగు అకాడమీ ఏర్పాటును
కూడా పట్టించుకోలేదు
0 Response to "ఆంగ్ల భాష నైపుణ్యం తప్పనిసరి; మంత్రి సురేష్"
Post a Comment