పది ఫలితాల పెంపునకు ప్రత్యేక ప్రణాళిక

హైదరాబాద్ : అనగననగ రాగ మతిశయిల్లుచుండును..తినగతినగ వేము తియ్యనుండును అన్నడో కవి. అచ్చం ఈ పద్య సారాంశాన్నే స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళుతున్నది హైదరాబాద్‌ జిల్లా విద్యాశాఖ. పదోతరగతి ఫలితాల పెంపునకు ఈ పద్ధతిని అనుసరిస్తున్నది. విద్యార్థులకు ప్రాక్టీస్‌ టెస్ట్‌లు నిర్వహించి..మూల్యాకనం చేసి వారు చేస్తున్న తప్పులను సరిదిద్ది, లోపాలను సవరించనున్నారు. డిసెంబర్‌, జనవరి, ఫిబ్రవరి మూడు మాసాల్లో ఈ టెస్ట్‌లను నిర్వహించడానికి విద్యాశాఖ అదికారులు షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఈ షెడ్యూల్‌ ప్రకారం ప్రాక్టీస్‌ టెస్ట్‌లను నిర్వహించాలని అధికారులు ఆదేశా లు జారీచేశారు. డిసెంబర్‌లో స్పెషల్‌ ప్రాక్టీస్‌ టెస్ట్‌ను, జనవరి, ఫిబ్రవరి మాసాల్లో వేర్వేరుగా ప్రాక్టీస్‌ టెస్ట్‌లను 


డిసెంబర్‌ 16 నుంచి 24 వరకు స్పెషల్‌ ప్రాక్టీస్‌ టెస్ట్‌, జనవరి 2 నుంచి ఫిబ్రవరి 10 వరకు రెండు విడతల్లో ప్రాక్టీస్‌ టెస్ట్‌లు ప్రభుత్వ, ప్రైవేట్‌, ఎయిడెడ్‌ పాఠశాలన్న తేడాల్లేకుండా అన్నింటిలోని ఎస్సెస్సీ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి సమాయత్తం చేయబోతున్నారు.

తీవ్ర కసరత్తు..

పదోతరగతి ఫలితాల్లో రాజధాని నగరం రోజురోజు దిగజారుతున్నది. ఫలితాలు ఏడాదికేడాది పడిపోతున్నాయి. దీంతో ఫలితాలను పెంచేందుకు విద్యాశాఖ అధికారులు మూడు మాసాల ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేశారు. దీంట్లో భాగంగా 25-9-19న విస్తృతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఫలితాల పెంపు ఏకైక ఎజెండాతో నిర్వహించిన ఈ సమావేశంలో విషయ నిపుణులు, ప్రధానోపాధ్యాయులు, పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయ సంఘాల నేతలతో సుధీర్ఘంగా సమీక్షించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రాక్టీస్‌ టెస్ట్‌లను నిర్వహించబోతున్నారు. జిల్లా ఉమ్మడి పరీక్షల నిర్వహణ బోర్డు ద్వారా ప్రశ్నపత్రాలను రూపొందించి అందజేయనున్నారు.

సీసీఈకి అలవాటు పడరేమి..

నిరంతర సమగ్ర మూల్యాంకనం ప్రవేశపెట్టి నాలుగేండ్లుదాటినా ఇంకా చాలా మంది ఈ విధానానికి అలవాటుపడటం లేదు. ముఖ్యంగా ప్రైవేట్‌ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు ఇంకా ఈ విధానానికి అనుగుణంగా నడుచుకోవడం లేదు. సీసీఈ విధానంలోని పరీక్షలు భిన్నంగా ఉంటాయి.పాఠ్యపుస్తకాలు, పాఠం చివర ఉన్న ప్రశ్నల నుంచి కాకుండా విభిన్నంగా ఇస్తున్నారు. కొన్ని ప్రశ్నలను మార్చి.. మార్చి ఇవ్వడంతో విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారు. ప్రశ్నను ఎన్ని మార్కులకు ఇచ్చారు..ఎంత మేర రాయాలన్న అవగాహన లేకుండా చదువుకున్నదంతా జవాబుపత్రాల్లో కుమ్మరిస్తున్నారు. ఇలాంటి లోపాలను ఇప్పటికి సవరించడం లేదు. ఇలాంటి ప్రశ్నలను కొంచెం సూక్ష్మంగా ఆలోచించే విద్యార్థులు మాత్రమే పూర్తిస్తాయిలో జవాబులు పూరించగలరు. అలా విద్యార్థులను సన్నద్ధం చేయాల్సి ఉన్నా ఇంకా కొన్ని పాఠశాలలు విద్యార్థులను బట్టిపట్టిస్తున్నాయి. దీంతోనే ప్రశ్నపత్రాలను చూపి బిత్తరపోవాల్సి పరిస్థితి తలెత్తుతున్నది. దీనికి చెక్‌పెట్టి.. విద్యార్థులు చేస్తున్న తప్పులను తాము తెలుసుకునేలా.. లోపాలను సవరించేలా చర్యలు తీసుకుంటున్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "పది ఫలితాల పెంపునకు ప్రత్యేక ప్రణాళిక"

Post a Comment