నేటి నుంచి నూతన విధానం
రిజిస్ట్రేషన్ శాఖ దస్త్రాల నమోదులో పారదర్శకత
రిజిస్ట్రేషన్ శాఖలో వేళ్లూనుకుని ఉన్న దళారీ వ్యవస్థకు చెక్ పెట్టే యోచనలో ప్రభుత్వం ప్రజలే దస్త్రాలు నమోదు చేసుకొనే విధానం అమలుకు నవంబరు 1 నుంచి శ్రీకారం చుట్టనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నూతనంగా రూపొందించిన ఈ విధానం అమలుకానుంది. దీని ద్వారా స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో పేరుకున్న అవినీతిని పారదోలి మధ్యవర్తుల(దస్తావేజు లేఖరులు) పెత్తనానికి కత్తెర వేయాలన్నది ప్రభుత్వ సంకల్పం.
న్యూస్టుడే, నెల్లూరు(బృందావనం)
సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చే కక్షిదారులకు దస్తావేజులు ఎలా రాసుకోవాలో తెలియక దళారులను ఆశ్రయిస్తుంటారు
దళారీ వ్యవస్థ దూరం
రాష్ట్ర ప్రభుత్వం స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖను ప్రక్షాళనం చేసేందుకు ప్రజా నమోదు విధానానికి అక్టోబరు 2 నుంచి విశాఖ జిల్లా నుంచి శ్రీకారం చుట్టింది. నవంబరు 1వ తేదీ నుంచి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అమలు కానుంది. ఈ విధానం ద్వారా స్థిర, చరాస్తుల క్రయ, విక్రయాలు ఇతర సేవలు అవసరమైనవారికి అన్ని రకాల నమూనాలను ఆన్లైన్లో ఉంచింది. ఎవరికి ఏ సేవలు కావాలన్నా వెబ్సైట్ ద్వారా దస్త్రాలను డౌన్లోడ్ చేసుకుని ఎవరికి వారే స్వయంగా దస్త్రాలను తయారుచేసుకోవచ్ఛు వాటి కోసం దళారుల వద్దకు వెళ్లి వారు అడిగినంత అదనపు సొమ్మును ఇవ్వాల్సిన అవసరం అసలు ఉండదు. పౌరులు ఏదైనా అనుమానాలున్నా, సమస్యలు ఎదురైనా సంబంధిత సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సబ్రిజిస్ట్రార్ను సంప్రదిస్తే సరిపోతుంది.
-కె. అబ్రహామ్, డి.ఐ.జి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ, నెల్లూరు

0 Response to "నేటి నుంచి నూతన విధానం"
Post a Comment