Village secretariat Results

పరీక్ష విడుదల కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సచివాలయ పరీక్షలకు మొత్తం 19,50,630 మంది అభ్యర్థులు హాజరుకాగా.. నియామక పరీక్షల్లో 1,98,184 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ఓపెన్‌ కేటగిరీలో 24,583 మంది, బీసీ కేటగిరీలో 1,00,494 మంది, ఎస్సీ కేటగిరీలో 63,629 మంది, ఎస్టీ కేటగిరీలో 9,458 మంది ఉత్తీర్ణత సాధించారు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,26,728 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం గతంలో నోటిఫికేషన్‌ జారీ చేసింది. వీటిలో గ్రామ సచివాలయాల్లో 13 విభాగాలకు సంబంధించి 95,088 ఉద్యోగాలు, వార్డు సచివాలయాల్లో 9 విభాగాలకు సంబంధించి 33,501 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 21.5లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 19.74 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. గ్రామ సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు అక్టోబర్‌ 2న విధుల్లో చేరనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల పాటు ప్రొబేషనరీ పీరియడ్‌గా ఉంటుంది. ఆ సమయంలో నెలకు రూ.15వేలు చొప్పున వేతనం చెల్లించనున్నారు.

అధికారులకు అభినందనలు: సీఎం జగన్‌

రికార్డు సమయంలో పరీక్షల ప్రక్రియను పూర్తి చేసిన అధికారులకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. ఏకకాలంలో ఇంతమందికి ఒకేసారి ఉద్యోగాలు ఇవ్వడం రికార్డన్నారు. ఎన్నికల హామీలో చెప్పినట్లుగా ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగాలిచ్చామన్నారు. ఒకే నోటిఫికేషన్‌లో 1,26,728 శాశ్వత ఉద్యోగాలను కల్పించడం చరిత్రలో ఇదే తొలిసారి అని సీఎం అన్నారు. పరీక్షల్లో విజయం సాధించిన వారిని ముఖ్యమంత్రి మనస్ఫూర్తిగా అభినందించారు.




CLICK HERE TO DOWNLOAD

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "Village secretariat Results"

Post a Comment