నీతి ఆయోగ్ అధికారులతో సీఎం సమావేశం

*✨ నీతి ఆయోగ్ అధికారులతో సీఎం సమావేశం - విద్యా వ్యవస్థ పై  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  స్పందన*

★ నిరక్ష్యరాస్యతను జీరో స్థాయికి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని, దీనికోసం బహుముఖ ప్రణాళికలు అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.

★ రాష్ట్రంలోని మొత్తం 44వేలకు పైగా ఉన్న పాఠశాలలను దశలవారీగా అభివృద్ధి చేస్తున్నామని, 

★ మొదటి దశలో 15వేల పాఠశాలల్లో 9 రకాల కనీస సదుపాయలను కల్పిస్తున్నామని వెల్లడి. 

★ వచ్చేఏడాది నుంచి ఒకటి నంచి ఎనిమిదవ తరగతి వరకు, తరువాత సంవత్సరంలో 9, 10 తరగతుల్లో.. ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నట్లు వెల్లడి. 

★ ప్రభుత్వ స్కూళ్లలో అన్ని సౌకర్యాలతోపాటు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, 

★ జనవరి 26 నుంచి అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తన్నట్లు స్పష్టం చేశారు. ఏడాదికి రూ. 15 వేలు అందిస్తామని వ్యాఖ్య. 

★ అమ్మ ఒడిని కేంద్ర మానవవనరుల అభివృద్ది శాఖ స్పాన్సర్‌ చేస్తే ఈ పథకం దేశానికి స్పూర్తిగా నిలుస్తుందని సీఎం జగన్‌ వెల్లడి. 

★ మధ్యాహ్నా భోజన పథకం కింద పంపిణీ చేస్తున్న ఆహారంలో నాణ్యతను పెంచి విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చామని సీఎం స్పష్టం చేశారు.

★ ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో 10 మందికి కొత్తగా ఉద్యోగాలు కల్పించామని అన్నారు.  

★ పిల్లల సంఖ్యకు తగినట్టుగా టీచర్లను ఉంచడానికి ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.

              🌿🌼🌸🌸🌼🌿

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "నీతి ఆయోగ్ అధికారులతో సీఎం సమావేశం"

Post a Comment